కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వం విప్ బాల్క సుమన్పై నిప్పులు చెరిగారు. ఇటీవల బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. రాహుల్ గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా..తప్పు లేదు నీకు అంటూ బాల్క సుమన్పై విమర్శలు చేశారు. బాల్క సుమన్ మీడియా ముందుకు వచ్చేటప్పుడు… కేసీఆర్ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి పంపితే మంచిదని, కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చి రాజకీయంగా మేము లాభం పొందినమా..? అని అన్నారు. లాభం పొందింది మీరు రిజర్వేష్లు రాలేదు.. రుణమాఫీ కాలే.. ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేదంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే అయ్యాడు.. లేకుంటే వార్డ్ నెంబర్ కు కూడా పనికి రాడని ఆయన ధ్వజమెత్తారు.
రాహుల్పై వ్యాఖ్యలు చేస్తావా.. అంత దమ్ముందా సుమన్.. నీ బతుకు ఎంతా..నువ్వెంత.. రాహుల్ గాంధీనీ క్షమాపణ చెప్పాలని అంటావా..? నువ్వు ఒక్కసారి ఓడిపోతే… కనుమరుగై పోతావు.. అంటూ ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ మీద ఇంకో సారి మాట్లాడితే ఊరుకోనని, పోలీసులు ఉంటే బతికి పోతా అనుకుంటున్నావు…? మా ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ వాళ్ళు వెంటపడితే తిరగలేవన్నారు. ఎంత సేపు ఉంటారు పోలీసులు.. సుమన్ ..ఒళ్ళు దగ్గర పెట్టుకో.. ఎవడో ఒకడు వచ్చి ఒళ్ళు పగలకొడతడు అంటూ హెచ్చరించారు.