Train Incident: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఇక్కడ రైలు పట్టాలపై ఇనుప రాడ్ పెట్టి రైలును బోల్తా కొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ విషయంపై రైల్వే, గ్వాలియర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన గురించి బిర్లా నగర్ రైల్వే స్టేషన్, గ్వాలియర్ రైల్వే స్టేషన్కు సమాచారం అందించారు రైలు సంబంధిత అధికారులు. రైల్వే సిబ్బందితో పాటు గ్వాలియర్ పోలీసులు కూడా సంఘటనా…
నవరాత్రుల పవిత్ర సందర్భంగా మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లా జమునియా గ్రామంలో భక్తులు ఒకవైపు దుర్గామాత పూజల్లో మునిగితేలుతుండగా మరోవైపు గిరిజనులు రావణుడిని ఆరాధిస్తున్నారు. జమునియా గ్రామం నగరానికి కేవలం 16 కిలోమీటర్ల దూరంలోని ట్యాంకి మొహల్లాలో ఈ అపూర్వ దృశ్యం కనిపిస్తోంది.
Train Derailed: గురువారం రాత్రి మధ్యప్రదేశ్ లోని రత్లామ్లో ఢిల్లీ – ముంబై మార్గంలో రైల్వే యార్డు సమీపంలో పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తున్న గూడ్స్ రైలు మూడు కోచ్లు పట్టాలు తప్పాయి. సమాచారం మేరకు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఘటనపై సంబంధించి రత్లాం డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్ఎం) రజనీష్ కుమార్ మాట్లాడుతూ.. వ్యాగన్ నుండి పెట్రోలియం లీక్ అవుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. Fastag…
గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయ సరిహద్దు గోడ కుప్పకూలింది. కాగా.. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని తెలుస్తోంది.
భోపాల్లోని ఓ ప్రైవేటు స్కూల్లో దారుణం జరిగింది. ఒక కెమిస్ట్రీ టీచర్.. బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పదే పదే సాడొమైజ్ చేయమని బలవంతం చేశాడు. అభ్యంతరం చెప్పడంతో పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. మొబైల్లో రికార్డ్ చేయమని బలవంతం చేశాడు. గతేడాది ఈ ఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో ఆర్మీ రైలును పేల్చివేసేందుకు కుట్ర పన్నిన కేసులో పెద్ద సంచలనం చోటుచేసుకుంది. ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డ లోపల పిండం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అల్ట్రాసౌండ్ పరీక్ష తర్వాత వైద్యులు ఈ విషయం తెలుసుకున్నారు. కాగా.. ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఒకరిద్దరు కాదు ఐదుగురు భార్యలు ఉన్నారు. ఇంజనీర్ మొదటి భార్య అని చెప్పుకుంటున్న ఓ మహిళ ఈ విషయమై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)కి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని ఇన్చార్జి ఎస్పీని వేడుకున్న మహిళ.. తన భర్త పని సాకుతో చాలా రోజులుగా ఇంటి నుంచి బయటే ఉంటున్నాడని తెలిపారు. పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ఆమె చెప్పారు. అంతే కాదు నిందితుడైన భర్త…
MP Horror: మధ్యప్రదేశ్ ఉమారియా జిల్లాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం 7 నెలల గర్భిణిని ఆమె భర్త, అత్తామామలు దారుణంగా చంపేశారు. శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. నిందితులు బాధితురాలిని కట్నం కోసం గత కొంతకాలంగా వేధిస్తున్నారు. ఆమె భర్తతో పాటు అత్తామామలు, ఇద్దరు ఆడపడచులపై కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మజ్గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నుంజ ఖమ్హారియా గ్రామ సమీపంలో ట్రక్కు ఆటోను బలంగా ఢీకొట్టి.. అనంతరం ఆటోపై బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి చెందారు. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.