Crime: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎక్స్ట్రా క్లాసుల పేరుతో అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది. నిందితుడైన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరంలోని చోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోచింగ్ సెంటర్లో ఈ దారుణం జరిగింది.
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పించే గురువునే చంపాడు ఓ విద్యార్థి. ఛతర్పుర్ జిల్లాలోని ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్కే సక్సేనా (55) ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు.
IPS officer: ఎంతో కష్టపడి సివిల్స్ క్లియర్ చేశాడు, ఎన్నో ఆశలతో పోస్టింగ్లో చేరేందుకు వెళ్తున్న యువ ఐపీఎస్ అధికారి విగతజీవిగా మారాడు. మధ్యప్రదేశ్కి చెందిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి కర్ణాటకలోని హసన్ జిల్లాలో తన మొదటి పోస్టింగ్ బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
మధ్యప్రదేశ్లోని భింద్లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక మహిళ కడుపులో కత్తెర ఉన్నట్లు సిటి స్కాన్లో తేలింది. ఇది చూసిన డాక్టర్లు షాకయ్యారు. ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 44 ఏళ్ల మహిళ రెండేళ్ల క్రితం గ్వాలియర్లోని కమలా రాజా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని దారుణం జరిగింది. మౌగంజ్ జిల్లాలో కదులుతున్న అంబులెన్స్లో ఇద్దరు వ్యక్తులు 16 ఏల్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌగంజ్ జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉన్న హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 25న ఈ సంఘటన జరిగింది.
Prasannajit Rangari: మధ్యప్రదేశ్లోని బాలాఘాట్కి చెందిన సంఘమిత్ర ఖోబ్రగాడే తన సోదరుడు ప్రసన్న జిత్ రంగరిని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయించేందుకు పోరాడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రసన్నజిత్ ఏడేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతడి కోసం కుటుంబీకులు తీవ్రంగా గాలించినప్పటికీ ఆచూకీ కనుగొనలేకపోయారు. చివరకు అతను మరణించినట్లు భావించారు.
Chicken: శాఖాహారం తినే ఇంటికి చికెన్ తీసుకువచ్చిన సోదరుడిని హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగింది. చికెన్ వ్యవహారంలో సోదరుడి హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు తల్లి కూడా సహకరించడంతో ఆమెను కూడా నిందితురాలిగా పోలీసులు చేర్చారు. Read Also: Vande Bharat: వందే భారత్ రైలు ఆహారంలో పురుగులు.. జీలకర్ర అని ఉద్యోగి దబాయింపు వివరాల ప్రకారం.. అన్షుల్ అనే వ్యక్తి తన ఇంటి…
మధ్యప్రదేశ్లోని రేవాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. సమోసాలో బల్లి కనిపించడంతో ఇక్కడ కలకలం రేగింది. దీంతో ఐదేళ్ల చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. నిజానికి.. సమోసా తిన్న తర్వాత రేవాలోని 5 ఏళ్ల చిన్నారికి వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారి కుటుంబం హోటల్ యజమానిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
US Election Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మంగళవారం ముగియగా.. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం కమలా హారిస్పై డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనగసాగుతున్నారు. ట్రెండ్స్లో మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ మెజారిటీకి చాలా దగ్గరగా వచ్చారు. భారతదేశంలో లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ప్రతి ఒక్కరూ…