Train Incident: ఎందుకురా ఇలా చేస్తున్నారు.. మరోమారు రైలును పట్టాలు తప్పించే ప్రయత్నాలు
- గ్వాలియర్లో ఘోర రైలు ప్రమాదం తప్పింది.
- రైలు పట్టాలపై ఇనుప రాడ్ పెట్టి రైలును బోల్తా కొట్టే ప్రయత్నం.
- ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ దగ్గర కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Incident: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఇక్కడ రైలు పట్టాలపై ఇనుప రాడ్ పెట్టి రైలును బోల్తా కొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ విషయంపై రైల్వే, గ్వాలియర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన గురించి బిర్లా నగర్ రైల్వే స్టేషన్, గ్వాలియర్ రైల్వే స్టేషన్కు సమాచారం అందించారు రైలు సంబంధిత అధికారులు. రైల్వే సిబ్బందితో పాటు గ్వాలియర్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు మొత్తం కేసును దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి గుర్తు తెలియని నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read Also: Minister Komatireddy: రైతులకు గుడ్ న్యూస్.. వారంలోపు మిగిలిన వారందరికీ రుణమాఫీ!
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ఇక మరోవైపు ప్యాసింజర్ రైలును పట్టాలు తప్పించే కుట్రలో భాగంగా.. ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ దగ్గర జగత్పూర్-దరియాపూర్ స్టేషన్ మధ్య బెనికామా గ్రామ సమీపంలో సిమెంట్ స్లీపర్ను పూడ్చిపెట్టారు. అయితే., ప్యాసింజర్ రైలు కంటే ముందే గూడ్స్ రైలు వచ్చింది. ఇది గమనించిన లోకో పైలట్ బ్రేక్ వేసి రైలును నిలిపివేశాడు. దింతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయంలో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఝాన్సీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ప్రయాగ్రాజ్ రాజేష్ కుమార్ కుష్వాహ మాట్లాడుతూ.. రైల్వే ట్రాక్ పక్కన ఉన్న సిమెంట్ స్లీపర్లన్నింటినీ తొలగించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. లక్నో స్థాయి నుంచి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని డివిజనల్ రైల్వే మేనేజర్ ఎస్ఎం శర్మ తెలిపారు.
తాజావార్తలు
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్కు బెయిల్!
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!