Madhya Pradesh: ప్రాణాలు తీసిన డీజే.. డ్యాన్స్ చేస్తూ 13 ఏళ్ల బాలుడు మృతి
- ప్రాణాలు తీసిన డీజే
- డ్యాన్స్ చేస్తూ 13 ఏళ్ల బాలుడు మృతి
- మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య సమాజంలోకి పాడు సంస్కృతి ప్రవేశించింది. ఉల్లాసమైనా, ఆనందమైనా పరిధిలో ఉండాలి. అది శృతిమించితే దు:ఖమే మిగులుతుంది. ఇప్పుడు ఏ శుభకార్యం జరిగినా.. ఏ పండుగ వచ్చినా మొట్టమొదటిగా గుర్తొచ్చేది డీజే సౌండే. ఏ చిన్న కార్యక్రమం జరిగినా నిర్వాహకులు డీజే సౌండ్నే బుక్ చేస్తున్నారు. కానీ దాని ప్రభావం కొందరి కుటుంబాల్లో విషాదం నింపుతుందన్న విచక్షణ ఎవరికీ ఉండడం లేదు. ఏ శబ్దమైనా లిమిట్లోనే ఉండాలి. అంతకు మించితే ప్రాణాలే పోతాయి. ఇదంతా ఎందుకుంటారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ని అప్పగించాలని కోరాం, కెనడా స్పందించలేదు: భారత్..
Also Read
- Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
- Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
- Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
- Suvendu Adhikari: దీదీ ‘ఖతం’ చేయాలనుకున్న గూర్ఖా దళానికి ఊపిరి పోస్తున్న సువేందు అధికారి.. బెంగాల్లో రాజకీయాల్లో కొత్త రచ్చ!
మధ్యప్రదేశ్లోని భోపాల్లో స్థానిక పండుగ జరుగుతోంది. ఈ వేడుకలో నిర్వాహకులు డీజే సౌండ్ ఏర్పాటు చేశారు. అందరూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ గంతులు వేస్తున్నారు. అక్కడే ఉన్న సమర్ బిల్లోర్ అనే బాలుడి(13)కి కూడా ఊపు వచ్చింది. ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా వారి మధ్యలోకి దూరి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే డీజే సౌండ్కి బాలుడి గుండె తట్టుకోలేకపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇంత జరిగినా మిగతా వారు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. బాలుడి తల్లి గమనించి.. సౌండ్ ఆపమని ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. డీజే సౌండ్ కారణంగా గుండె పోటు వచ్చి ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
డీజే సౌండ్ ఎక్కువగా ఉండడంతోనే తన కొడుకు ప్రాణాలు పోయాయని సమర్ తండ్రి కైలాష్ బిల్లోర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకు మృతికి డీజేనే కారణమని ఆరోపించాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆగలేదని, తమ అబ్బాయి ప్రాణం పోయినా ఆ సందడిని ఏదీ ఆపలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సమయంలో ఇలాంటి సౌండ్ సిస్టమ్స్ నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల కారణంగా ఇంట్లోని రోగులు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయాడు.
ఇదిలా ఉంటే హైదరాబాద్లో డీజే సౌండ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో నగరంలో డీజే సౌండ్ను పోలీసులు నిషేధం విధించారు. డీజే సౌండ్ కారణంగా పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో హైదరాబాద్ సీపీ సీవీ. ఆనంద్ .. డీజేను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఇంతకంటే మంచి సమయం లేదు.. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
తాజావార్తలు
-
Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
-
Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
-
Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
-
Raghava Lawrence : ఆలు లేదు, చూలు లేదు.. పదవి పేరు డిప్యూటీ సీఎం!
-
Guinness World Records Village: 80 ఏళ్లకైనా జుట్టు నల్లగానే.. ఆ రహస్యం ఏమిటి?
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!