Madhya Pradesh: ప్రాణాలు తీసిన డీజే.. డ్యాన్స్ చేస్తూ 13 ఏళ్ల బాలుడు మృతి
- ప్రాణాలు తీసిన డీజే
- డ్యాన్స్ చేస్తూ 13 ఏళ్ల బాలుడు మృతి
- మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య సమాజంలోకి పాడు సంస్కృతి ప్రవేశించింది. ఉల్లాసమైనా, ఆనందమైనా పరిధిలో ఉండాలి. అది శృతిమించితే దు:ఖమే మిగులుతుంది. ఇప్పుడు ఏ శుభకార్యం జరిగినా.. ఏ పండుగ వచ్చినా మొట్టమొదటిగా గుర్తొచ్చేది డీజే సౌండే. ఏ చిన్న కార్యక్రమం జరిగినా నిర్వాహకులు డీజే సౌండ్నే బుక్ చేస్తున్నారు. కానీ దాని ప్రభావం కొందరి కుటుంబాల్లో విషాదం నింపుతుందన్న విచక్షణ ఎవరికీ ఉండడం లేదు. ఏ శబ్దమైనా లిమిట్లోనే ఉండాలి. అంతకు మించితే ప్రాణాలే పోతాయి. ఇదంతా ఎందుకుంటారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ని అప్పగించాలని కోరాం, కెనడా స్పందించలేదు: భారత్..
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
మధ్యప్రదేశ్లోని భోపాల్లో స్థానిక పండుగ జరుగుతోంది. ఈ వేడుకలో నిర్వాహకులు డీజే సౌండ్ ఏర్పాటు చేశారు. అందరూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ గంతులు వేస్తున్నారు. అక్కడే ఉన్న సమర్ బిల్లోర్ అనే బాలుడి(13)కి కూడా ఊపు వచ్చింది. ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా వారి మధ్యలోకి దూరి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే డీజే సౌండ్కి బాలుడి గుండె తట్టుకోలేకపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇంత జరిగినా మిగతా వారు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. బాలుడి తల్లి గమనించి.. సౌండ్ ఆపమని ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. డీజే సౌండ్ కారణంగా గుండె పోటు వచ్చి ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
డీజే సౌండ్ ఎక్కువగా ఉండడంతోనే తన కొడుకు ప్రాణాలు పోయాయని సమర్ తండ్రి కైలాష్ బిల్లోర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకు మృతికి డీజేనే కారణమని ఆరోపించాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆగలేదని, తమ అబ్బాయి ప్రాణం పోయినా ఆ సందడిని ఏదీ ఆపలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సమయంలో ఇలాంటి సౌండ్ సిస్టమ్స్ నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల కారణంగా ఇంట్లోని రోగులు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయాడు.
ఇదిలా ఉంటే హైదరాబాద్లో డీజే సౌండ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో నగరంలో డీజే సౌండ్ను పోలీసులు నిషేధం విధించారు. డీజే సౌండ్ కారణంగా పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో హైదరాబాద్ సీపీ సీవీ. ఆనంద్ .. డీజేను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఇంతకంటే మంచి సమయం లేదు.. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!