Fire In Train: కదులుతున్న రైలులో భారీగా మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు
- మధ్యప్రదేశ్లోని రత్లామ్ జిల్లాలో..
- ప్రయాణికులతో వెళ్తున్న డీఈఎంయూ రైలు ఇంజిన్లో భారీగా మంటలు.
- భయాందోళనలో ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire In Train: మధ్యప్రదేశ్లోని రత్లామ్ జిల్లాలో ఆదివారం నాడు ప్రయాణికులతో వెళ్తున్న డీఈఎంయూ రైలు ఇంజిన్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మేరకు ఓ రైల్వే అధికారి ఒకరు విషయాన్ని వెల్లడించారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారి తెలిపారు. ఈ ప్రమాదం చాలా భయంకరంగా ఉండడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. డాక్టర్ అంబేద్కర్ నగర్ (మోవ్) నుంచి రత్లాంకు బయలుదేరిన డీఎంయూ రైలు ఇంజిన్లో సాయంత్రం 5.30 గంటల సమయంలో రుణిజా – నౌగావ్ మధ్య మంటలు చెలరేగినట్లు పశ్చిమ రైల్వేలోని రత్లాం డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఖేమ్రాజ్ మీనా తెలిపారు.
Read Also: Ayodhya Diwali: ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్న రాంలాలా ఆలయం
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
డైలీ ప్యాసింజర్ రైలులో మంటలు అదుపులోకి తెచ్చామని తెలిపారు. అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని మీనా తెలిపారు. మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. రైలు ప్రీతమ్ నగర్కు మూడు కిలోమీటర్ల ముందు ఉండగా, రైలు ఇంజిన్ నుండి ఒక్కసారిగా పొగ రావడం మొదలైంది. పొగలు రావడంతో రైలును అడవిలోనే నిలిపివేశారు. రైలు ఆగిన తర్వాత ఇంజన్లో మంటలు వచ్చినట్లు సమాచారం అందిన వెంటనే ప్రయాణికులు కూడా రైలు నుంచి బయటకు వచ్చారు. రైలు ఆగిన వెంటనే గ్రామస్థులు కూడా రైలు పరిసరాలకు వచ్చారు. దీని తరువాత సమీపంలోని గొట్టపు బావి నుండి పైపును కనెక్ట్ చేసి మంటలను ఆర్పారు. దాదాపు అరగంట పాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. మంటలు ఆర్పిన తర్వాత రైలును ప్రీతమ్ నగర్కు తీసుకొచ్చారు. రత్లాం నుంచి వచ్చిన రైల్వే అధికారులు రైలును పరిశీలించారు. విచారణ అనంతరం డీఈఎంయూ రైలును రత్లాంకు తీసుకువస్తారు.
Read Also: Ponnam Prabhakar : తాగి దొరికిన కేసులో బుకాయించి మాట్లాడితే తప్పు ఒప్పైతదనుకుంటే పొరపాటు
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!