Ujjain: విషాదకర సంఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆమె ధరించిన దుపట్టానే మెడకు ఉరితాడులా బిగుసుకుపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలోని ఫుడ్ సెంటర్లో చోటు చేసుకుంది. బంగాళాదుంపల తొక్క తీసే యంత్రంలో దుపట్టా చిక్కుకుపోయింది. దీంతో మెడకకు బిగుసుకుపోవడంతో 30 ఏళ్ల మహిళ శనివారం మరణించినట్లు అధికారులు తెలిపారు.
Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ముంబై, విదర్భ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్లో అభిమానులు మరోసారి అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ను ఆస్వాదించారు. అయితే, స్టార్ ప్లేయర్లతో అలరించిన ముంబై జట్టు ఎట్టకేలకు మ్యాచ్లో విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెమీ ఫైనల్కు చేరిన మూడు జట్లను ఖరారు అయ్యాయి. ముంబై కంటే ముందు…
Crime: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎక్స్ట్రా క్లాసుల పేరుతో అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది. నిందితుడైన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరంలోని చోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోచింగ్ సెంటర్లో ఈ దారుణం జరిగింది.
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పించే గురువునే చంపాడు ఓ విద్యార్థి. ఛతర్పుర్ జిల్లాలోని ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్కే సక్సేనా (55) ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు.
IPS officer: ఎంతో కష్టపడి సివిల్స్ క్లియర్ చేశాడు, ఎన్నో ఆశలతో పోస్టింగ్లో చేరేందుకు వెళ్తున్న యువ ఐపీఎస్ అధికారి విగతజీవిగా మారాడు. మధ్యప్రదేశ్కి చెందిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి కర్ణాటకలోని హసన్ జిల్లాలో తన మొదటి పోస్టింగ్ బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
మధ్యప్రదేశ్లోని భింద్లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక మహిళ కడుపులో కత్తెర ఉన్నట్లు సిటి స్కాన్లో తేలింది. ఇది చూసిన డాక్టర్లు షాకయ్యారు. ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 44 ఏళ్ల మహిళ రెండేళ్ల క్రితం గ్వాలియర్లోని కమలా రాజా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని దారుణం జరిగింది. మౌగంజ్ జిల్లాలో కదులుతున్న అంబులెన్స్లో ఇద్దరు వ్యక్తులు 16 ఏల్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌగంజ్ జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉన్న హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 25న ఈ సంఘటన జరిగింది.
Prasannajit Rangari: మధ్యప్రదేశ్లోని బాలాఘాట్కి చెందిన సంఘమిత్ర ఖోబ్రగాడే తన సోదరుడు ప్రసన్న జిత్ రంగరిని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయించేందుకు పోరాడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రసన్నజిత్ ఏడేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతడి కోసం కుటుంబీకులు తీవ్రంగా గాలించినప్పటికీ ఆచూకీ కనుగొనలేకపోయారు. చివరకు అతను మరణించినట్లు భావించారు.
Chicken: శాఖాహారం తినే ఇంటికి చికెన్ తీసుకువచ్చిన సోదరుడిని హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగింది. చికెన్ వ్యవహారంలో సోదరుడి హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు తల్లి కూడా సహకరించడంతో ఆమెను కూడా నిందితురాలిగా పోలీసులు చేర్చారు. Read Also: Vande Bharat: వందే భారత్ రైలు ఆహారంలో పురుగులు.. జీలకర్ర అని ఉద్యోగి దబాయింపు వివరాల ప్రకారం.. అన్షుల్ అనే వ్యక్తి తన ఇంటి…