Murder Mystery: హత్యా నిందితుడిని పట్టించిన ‘‘ఈగలు’’.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే..?
- హత్య కేసులో నిందితుడిని పట్టించిన ‘‘ఈగలు’’..
- ఈగల ద్వారా కేసుని సాల్వ్ చేసి మధ్యప్రదేశ్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder Mystery: ఎలాంటి ఆధారాలు లేని ఒక హత్య కేసులో మధ్యప్రదేశ్ పోలీసులకు ‘‘ఈగలు’’ సాయపడ్డాయి. తన మామని చంపిన కేసులో 19 ఏళ్ల యువకుడిని పట్టించాయి. చివరకు ఈగల వల్ల యువకుడు తాను చేసిన హత్యా నేరాన్ని ఒప్పుకున్నాడు. సరైన సాక్ష్యాధారాలు లేకున్నా పోలీసులు ఈ కేసును ఛేదించారు.
ఏం జరిగింది..?
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
దీపావళి సందర్భంగా అక్టోబర్ 30న మనోజ్ ఠాకూర్ అలియాస్ మన్ను(26), అతని మేనల్లుడు ధరమ్ సింగ్(19) ఇద్దరూ కలిసి మద్యం తాగి విందు చేసుకునేందుకు బయటకు వెళ్లారు. అయితే, దీని తర్వాత ధరమ్ సింగ్ ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ, మనోజ్ కుమార్ రాలేదు. తర్వాతి రోజు బబల్పూర్ నగర శివార్లలో అతని మృతదేహం కనిపించింది.
Read Also: Wedding Season: వచ్చే నెల రోజుల్లో 48 లక్షల పెళ్లిళ్లు.. రూ.6 లక్షల కోట్ల వ్యాపారం..
మేనల్లుడి విచారణ..
మనోజ్ కుమార్తో చివరిసారిగా ధరమ్ సింగ్ మాత్రమే ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడిని విచారించారు. అయితే, తొలిసారి విచారణలో తనకు ఏం తెలియదని చెప్పాడు. పోలీసులు కూడా అతడిని అనుమానించలేదు. హత్యకు ప్రత్యక్ష సాక్ష్యాలు కానీ, దోపిడీ ఆనవాళ్లు ఏమీ లేవు. మరోసారి ధరమ్ సింగ్ని విచారించాలని పోలీసులు భావించారు. అయితే, ఆ సమయంలోనే వింత జరిగింది. విచారణ గదిలో పోలీసులు ఉండగా, వారిని కాదని ఈగలు ధరమ్ సింగ్ చుట్టూ తిరగడం ప్రారంభించాయి. ఎంతగా వాటిని పారద్రోలేందుకు ప్రయత్నించినప్పటికీ, అవి ధరమ్ సింగ్ చూట్టూనే తిరిగాయి.
దీంతో అనుమానించిన చార్గవాన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అభిషేక్ పయాసికి అనుమానం కలిగింది. అతడి చొక్కాను పరీక్షల కోసం పంపాడు. డార్క్ కలర్ చొక్కా కావడంతో కళ్ల ద్వారా రక్తపు మరకల్ని గుర్తించలేదు. పరీక్షల్లో మాత్రం చొక్కాపై రక్తపు మరకలను గుర్తించారు. చివరకు గట్టిగా ప్రశ్నించడంతో నిందితుడు ధరమ్ సింగ్ నేరాన్ని ఒప్పుకున్నాడు. మద్యం తాగిన తర్వాత, ఆహారం కోసం ఎక్కువ చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుందని, చెక్కతో మనోజ్ ఠాకూర్ని కొట్టినట్లు ధరమ్ సింగ్ చెప్పాడు. హత్యకు ఉపయోగించిన చెక్క ముక్కను నేరస్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!