Bhopal Gas Tragedy: భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్లకు కీలక నిర్ణయం..
- భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్లకు కీలక నిర్ణయం..
- 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కుల్లో పితంపూర్ పారిశ్రామిక వాడకు తరలింపు..
- ఈ ట్రక్కుల తరలింపుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు: భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ డైరెక్టర్
Bhopal Gas Tragedy: భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్ల తర్వాత యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న 377 టన్నుల విష వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కుల్లో భోపాల్కు 250 కిలో మీటర్ల దూరంలోని ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక వాడకు తరలిస్తున్నారు. వాటిని తీసుకెళ్తున్న 12 కంటైనర్ ట్రక్కులు రాత్రి 9 గంటల ప్రాంతంలో వాటి ప్రయాణాన్ని స్టార్ట్ చేశాయి.. వీటి కోసం గ్రీన్ కారిడార్ను రూపొందించారు. ఈ ప్రయాణానికి సుమారు7 గంటల సమయం పడుతుందని సమాచారం. దాదాపు 100 మంది కార్మికులు 30 నిమిషాల షిఫ్టుల్లో వ్యర్థాలను ప్యాక్ చేసి ట్రక్కుల్లోకి ఎక్కించేశారు.
Read Also: DD 4 : ధనుష్ దర్శకత్వంలో ‘ఇడ్లీ – కడాయ్’.. ఫస్ట్ లుక్ రిలీజ్
Also Read
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
- Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, గత ఆదివారం నుంచి వీటిని ప్యాక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, ప్రతి 30 నిమిషాలకు రెస్ట్ ఇచ్చారు. ట్రక్కులు విష వ్యర్థాలతో ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే, 3 నెలల్లో ఆ వ్యర్థాలను పూర్తిగా కాల్చివేస్తామని భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ వెల్లడించారు. ఏదైనా ఆటంకం కలిగితే, ఈ పనికి తొమ్మిది నెలల వరకు టైం పట్టవచ్చన్నారు. మొదట్లో పితంపూర్లోని వ్యర్థ పదార్థాల యూనిట్లో కొంత వ్యర్థాలను కాల్చి వేయనున్నారు.
Read Also: Anand Devarakonda : ‘బేబి’ కాంబోలో మరో సినిమా.. దర్శకుడు ఎవరంటే..?
ఇక, కాల్చిన తర్వాత ఆ వ్యర్థాల బూడిదలో ఏదైనా హానికరమైన మూలకం ఇంకా మిగిలి ఉందా లేదా అని తెలుసుకోవడానికి పరిశీలిస్తామని భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ చెప్పారు. విషపూరిత మూలకాల జాడలు లేవని నిర్ధారించిన తర్వాత ఆ బూడిదను మట్టి, నీటితో సంబంధంలోకి రాకుండా పాతిపెడతామన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పర్యవేక్షణలో నిపుణుల టీమ్ ఈ ప్రక్రియను చేపట్టనుందన్నారు. 2015లో పీతాంపూర్లో 10 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మకంగా కాల్చివేశాం.. దాని వల్ల సమీప గ్రామాల మట్టి, భూగర్భ జలాలు, నీటి వనరులు కలుషితం అవుతున్నాయని కొందరు స్థానికులు చెప్పారు. కానీ, వారి వాదనను భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ తోసిపుచ్చారు. 2015 పరీక్ష నివేదిక, అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే పితాంపూర్ దగ్గర వ్యర్థాలను పారవేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, 1.75 లక్షల జనాభా ఉన్న పితాంపూర్లో వ్యర్థాలను పారవేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం నాడు ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
-
Boyapati : ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బోయపాటికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని స్టార్స్
-
Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
-
Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
-
BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!