Ujjain: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చర్చిపై రాతలు..
- క్రైస్తవుల అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్
- ప్రారంభమైన చర్చిల అలంకరణ
- ఉజ్జయినిలో గందరగోళం
- చర్చిపై మందిర్ అని రాసిన బోర్డు ప్రత్యక్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రైస్తవుల అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్కు ముందు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో చర్చిలను అలంకరించారు. ఈ నేపథ్యంలో ఓ చర్చిపై ‘ఆలయం'(మందిర్) అని రాశారు. దీనికి హిందూ సంస్థల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొత్త వివాదం తలెత్తింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఎస్డిఎమ్తో ఈ అంశంపై చర్చించారు. రెండు రోజుల్లో చర్చి నుండి దేవాలయం అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు హింసాత్మక ఆందోళనలు కూడా తప్పవని హెచ్చరించారు. ఈ వివాదం పెరగడంతో చర్చి ట్రస్టీ ప్రధాన ద్వారం వద్ద ఉన్న బోర్డుపై ‘మందిర్’ అనే పదాన్ని తొలగించారు.
READ MORE: Wayanad: ప్రియాంక విజయంపై హైకోర్టులో నవ్య సవాల్.. అక్రమాలు చోటుచేసుకున్నాయని పిటిషన్
Also Read
- Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ 'తవా పనీర్ టిక్కా'.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
- Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
హిందూ సమాజానికి చెందిన గ్రామస్థులు దానిని దేవాలయంగా అనుకుని అందులోకి వెళ్లేందుకు, మత మార్పిడి ఉచ్చులో భాగంగా ఇల చేశారని.. హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన ఉజ్జయినిలోని దేవాస్ రోడ్డులో ఉన్న 78 ఏళ్ల నాటి చర్చికి సంబంధించినది. ప్రధాన ద్వారంపై ‘మసిహి మందిర్ చర్చి’ అని రాసి ఉంది. బుధవారం నుంచి వివాదం మొదలైనట్లు సమాచారం.దీనిపై వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు మహేశ్ తివారీ మాట్లాడుతూ.. “చర్చిపై దేవాలయం అని రాయడం వల్ల హిందూ సోదరులు గందరగోళానికి గురవుతున్నారు. ఇక్కడ మత మార్పిడి జరుగుతుంది. కాబట్టి దేవాలయం అనే పదాన్ని తొలగించాలి. చర్చిపై దేవాలయం రాయడం వల్ల మన మత విశ్వాసాలు దెబ్బతింటాయి. అమాయక హిందూ సమాజం అయోమయానికి గురవుతోంది. హిందూ మతంలో దేవాలయం అనే పదాన్ని సనాతని ఆలయాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ పదాన్ని చర్చిలకు జోడించడం సరికాదు.” అని పేర్కొన్నారు .
READ MORE: Minister Nimmala Rama Naidu: అన్నదాతల అండదండలన్నీ కూటమి ప్రభుత్వానికే.. మరోసారి రుజువైంది..
తాజావార్తలు
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..