Ujjain: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చర్చిపై రాతలు..
- క్రైస్తవుల అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్
- ప్రారంభమైన చర్చిల అలంకరణ
- ఉజ్జయినిలో గందరగోళం
- చర్చిపై మందిర్ అని రాసిన బోర్డు ప్రత్యక్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రైస్తవుల అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్కు ముందు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో చర్చిలను అలంకరించారు. ఈ నేపథ్యంలో ఓ చర్చిపై ‘ఆలయం'(మందిర్) అని రాశారు. దీనికి హిందూ సంస్థల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొత్త వివాదం తలెత్తింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఎస్డిఎమ్తో ఈ అంశంపై చర్చించారు. రెండు రోజుల్లో చర్చి నుండి దేవాలయం అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు హింసాత్మక ఆందోళనలు కూడా తప్పవని హెచ్చరించారు. ఈ వివాదం పెరగడంతో చర్చి ట్రస్టీ ప్రధాన ద్వారం వద్ద ఉన్న బోర్డుపై ‘మందిర్’ అనే పదాన్ని తొలగించారు.
READ MORE: Wayanad: ప్రియాంక విజయంపై హైకోర్టులో నవ్య సవాల్.. అక్రమాలు చోటుచేసుకున్నాయని పిటిషన్
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
హిందూ సమాజానికి చెందిన గ్రామస్థులు దానిని దేవాలయంగా అనుకుని అందులోకి వెళ్లేందుకు, మత మార్పిడి ఉచ్చులో భాగంగా ఇల చేశారని.. హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన ఉజ్జయినిలోని దేవాస్ రోడ్డులో ఉన్న 78 ఏళ్ల నాటి చర్చికి సంబంధించినది. ప్రధాన ద్వారంపై ‘మసిహి మందిర్ చర్చి’ అని రాసి ఉంది. బుధవారం నుంచి వివాదం మొదలైనట్లు సమాచారం.దీనిపై వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు మహేశ్ తివారీ మాట్లాడుతూ.. “చర్చిపై దేవాలయం అని రాయడం వల్ల హిందూ సోదరులు గందరగోళానికి గురవుతున్నారు. ఇక్కడ మత మార్పిడి జరుగుతుంది. కాబట్టి దేవాలయం అనే పదాన్ని తొలగించాలి. చర్చిపై దేవాలయం రాయడం వల్ల మన మత విశ్వాసాలు దెబ్బతింటాయి. అమాయక హిందూ సమాజం అయోమయానికి గురవుతోంది. హిందూ మతంలో దేవాలయం అనే పదాన్ని సనాతని ఆలయాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ పదాన్ని చర్చిలకు జోడించడం సరికాదు.” అని పేర్కొన్నారు .
READ MORE: Minister Nimmala Rama Naidu: అన్నదాతల అండదండలన్నీ కూటమి ప్రభుత్వానికే.. మరోసారి రుజువైంది..
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!