Syed Mushtaq Ali Trophy: విదర్భ బౌలర్లను ఊచకోత కోసిన అజింక్య రహానే.. సెమిస్లోకి దూసుకెళ్లిన ముంబై
- విదర్భ బౌలర్లను ఊచకోత కోసిన అజింక్య రహానే..
- సెమిస్లోకి దూసుకెళ్లిన ముంబై
- బరోడా, మధ్యప్రదేశ్ కూడా సెమీ ఫైనల్కు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ముంబై, విదర్భ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్లో అభిమానులు మరోసారి అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ను ఆస్వాదించారు. అయితే, స్టార్ ప్లేయర్లతో అలరించిన ముంబై జట్టు ఎట్టకేలకు మ్యాచ్లో విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెమీ ఫైనల్కు చేరిన మూడు జట్లను ఖరారు అయ్యాయి. ముంబై కంటే ముందు బరోడా, మధ్యప్రదేశ్ కూడా సెమీ ఫైనల్కు చేరుకున్నాయి.
Also Read: Taliban Minister Killed: కాబూల్లో భారీ పేలుడు.. తాలిబన్ మంత్రి మృతి
Also Read
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
- 7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కీలకమైన మ్యాచ్లో ఇరు జట్లు 200కు పైగా పరుగులు చేశాయి. ఈ మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోయాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. అథర్వ టైడే అత్యధికంగా 66 పరుగులు చేశాడు. అలాగే, అపూర్వ వాంఖడే 33 బంతుల్లో 51 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. చివరిలో శుభమ్ దూబే 19 బంతుల్లో 43 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మరోవైపు ముంబై తరఫున అథర్వ అంకోలేకర్, సూర్యాంశ్ షెడ్గే చెరో 2 వికెట్లు తీశారు.
Mumbai are into the semis 👏
They ace yet another run chase, chasing down 222 against Vidarbha to win by 6 wickets 🙌
With 60 needed off the last 4 overs, Shivam Dube & Suryansh Shedge pulled off a terrific win 👌
pic.twitter.com/dBwnQNqlgD— Rohit Baliyan (@rohit_balyan) December 11, 2024
Also Read: Smriti Mandhana: రికార్డు బ్రేక్.. ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్గా స్మృతి
ఇక భారికి లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్ బ్యాట్స్మెన్ పృథ్వీ షా, అజింక్యా రహానేలు అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్కు 7 ఓవర్లలో 83 పరుగులు జోడించారు. ఆ తర్వాత పృథ్వీ షా 26 బంతుల్లో 49 పరుగులు, రహానే 45 బంతుల్లో 84 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఆ తర్వాత శివమ్ దూబే 22 బంతుల్లో అజేయంగా 37 పరుగులు, సూర్యాంశ్ షెడ్గే 12 బంతుల్లో అజేయంగా 36 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిసి మొత్తం 445 పరుగులు వచ్చాయి. ఇక ఇదే సీజన్ లో ముంబై, ఆంధ్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మొత్తం 448 పరుగులు వచ్చాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒక మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు గోవా, ముంబై జట్లు కలిసి మొత్తంగా 474 పరుగులు చేసాయి.
తాజావార్తలు
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
-
Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’ రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్టైమ్ రికార్డ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!