IT Raids: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ రైడ్స్.. బయట పడిన మూడు మొసళ్లు..
- మధ్యప్రదేశ్ లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు..
- మాజీ ఎమ్మెల్యే రాథోడ్ ఇంట్లో తనిఖీల్లో బయటపడిన మూడు మొసళ్లు..
- బంగారం, వెండి ఆభరణాలు ఐటీశాఖ స్వాధీనం.. మొసళ్లను అటవీశాఖకు అప్పగింత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హరివంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, తనిఖీల్లో అధికారులకు షాక్ తగిగిలింది. బంగారం, కోట్ల నగదు, బినామీ కార్లతో పాటు ఆ ఇంట్లో మూడు మొసళ్లను కూడా వారు గుర్తించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే రాథోడ్తో పాటు మాజీ కౌన్సిలర్ రాజేశ్ కేశర్వాని ఇళ్లలో గత ఆదివారం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు చేస్తున్నారు. సుమారు రూ. 155 కోట్ల పన్ను ఎగవేసినట్లు సమాచారం. ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటి నుంచి మూడు కోట్ల నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు ఐటీ అధకారులు.
Read Also: Great Republic Day Sale 2025: అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ సేల్.. ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవే!
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
కాగా, రాథోడ్, కేశర్వాని .. ఇద్దరూ బీడీ వ్యాపారం చేసేవారు. అయితే, కేశర్వాని సుమారు రూ. 140 కోట్ల పన్ను ఎగవేసినట్లు తేలగా.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను తనిఖీల చేస్తున్న సమయంలో.. అతను నిర్మాణ రంగంలో ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇక, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ ఇంట్లో సోదాలు చేయగా మూడు మొసళ్లు ఉన్నట్లు గుర్తించారు. నివాసంలోని ఓ చిన్న కుంటలో అవి ఉండటంతో అటవీ శాఖను ఆదాయపు పన్నుశాఖ అధికారులు అలర్ట్ చేశారు.
Read Also: CM Revanth Reddy : 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం..
అయితే, కేశర్వాని ఇంట్లోనూ పలు బినామీ పేరుతో దిగుమి చేసుకున్న కార్లను ఐటీ అధికారులు గుర్తించారు. అందులో ఒక్క కారు కూడా అతడి కుటుంబం పేరిట లేదని తేలింది. ట్రాన్స్పోర్టు శాఖ నుంచి కార్లకు చెందిన సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఆ కార్లను ఎలా కొనుగోలు చేశారన్న దానిపై విచారణ చేస్తున్నారు. సాగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ తొలుత బిజినెస్ చేసేవాడు.. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన శాసనసభ్యుడిగా విజయం సాధించాడు. జిల్లా అధ్యక్షుడి పోస్టు కోసం కూడా తీవ్రంగా పోటీ చేశారు. ఆయన తండ్రి హర్నమ్ సింగ్ రాథోడ్ సైతం గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా విధులు నిర్వహించారు.
తాజావార్తలు
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!