IT Raids: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ రైడ్స్.. బయట పడిన మూడు మొసళ్లు..
- మధ్యప్రదేశ్ లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు..
- మాజీ ఎమ్మెల్యే రాథోడ్ ఇంట్లో తనిఖీల్లో బయటపడిన మూడు మొసళ్లు..
- బంగారం, వెండి ఆభరణాలు ఐటీశాఖ స్వాధీనం.. మొసళ్లను అటవీశాఖకు అప్పగింత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హరివంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, తనిఖీల్లో అధికారులకు షాక్ తగిగిలింది. బంగారం, కోట్ల నగదు, బినామీ కార్లతో పాటు ఆ ఇంట్లో మూడు మొసళ్లను కూడా వారు గుర్తించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే రాథోడ్తో పాటు మాజీ కౌన్సిలర్ రాజేశ్ కేశర్వాని ఇళ్లలో గత ఆదివారం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు చేస్తున్నారు. సుమారు రూ. 155 కోట్ల పన్ను ఎగవేసినట్లు సమాచారం. ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటి నుంచి మూడు కోట్ల నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు ఐటీ అధకారులు.
Read Also: Great Republic Day Sale 2025: అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ సేల్.. ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవే!
Also Read
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
- Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
కాగా, రాథోడ్, కేశర్వాని .. ఇద్దరూ బీడీ వ్యాపారం చేసేవారు. అయితే, కేశర్వాని సుమారు రూ. 140 కోట్ల పన్ను ఎగవేసినట్లు తేలగా.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను తనిఖీల చేస్తున్న సమయంలో.. అతను నిర్మాణ రంగంలో ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇక, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ ఇంట్లో సోదాలు చేయగా మూడు మొసళ్లు ఉన్నట్లు గుర్తించారు. నివాసంలోని ఓ చిన్న కుంటలో అవి ఉండటంతో అటవీ శాఖను ఆదాయపు పన్నుశాఖ అధికారులు అలర్ట్ చేశారు.
Read Also: CM Revanth Reddy : 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం..
అయితే, కేశర్వాని ఇంట్లోనూ పలు బినామీ పేరుతో దిగుమి చేసుకున్న కార్లను ఐటీ అధికారులు గుర్తించారు. అందులో ఒక్క కారు కూడా అతడి కుటుంబం పేరిట లేదని తేలింది. ట్రాన్స్పోర్టు శాఖ నుంచి కార్లకు చెందిన సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఆ కార్లను ఎలా కొనుగోలు చేశారన్న దానిపై విచారణ చేస్తున్నారు. సాగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ తొలుత బిజినెస్ చేసేవాడు.. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన శాసనసభ్యుడిగా విజయం సాధించాడు. జిల్లా అధ్యక్షుడి పోస్టు కోసం కూడా తీవ్రంగా పోటీ చేశారు. ఆయన తండ్రి హర్నమ్ సింగ్ రాథోడ్ సైతం గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా విధులు నిర్వహించారు.
తాజావార్తలు
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!