IT Raids: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ రైడ్స్.. బయట పడిన మూడు మొసళ్లు..
- మధ్యప్రదేశ్ లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు..
- మాజీ ఎమ్మెల్యే రాథోడ్ ఇంట్లో తనిఖీల్లో బయటపడిన మూడు మొసళ్లు..
- బంగారం, వెండి ఆభరణాలు ఐటీశాఖ స్వాధీనం.. మొసళ్లను అటవీశాఖకు అప్పగింత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హరివంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, తనిఖీల్లో అధికారులకు షాక్ తగిగిలింది. బంగారం, కోట్ల నగదు, బినామీ కార్లతో పాటు ఆ ఇంట్లో మూడు మొసళ్లను కూడా వారు గుర్తించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే రాథోడ్తో పాటు మాజీ కౌన్సిలర్ రాజేశ్ కేశర్వాని ఇళ్లలో గత ఆదివారం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు చేస్తున్నారు. సుమారు రూ. 155 కోట్ల పన్ను ఎగవేసినట్లు సమాచారం. ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటి నుంచి మూడు కోట్ల నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు ఐటీ అధకారులు.
Read Also: Great Republic Day Sale 2025: అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ సేల్.. ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవే!
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
కాగా, రాథోడ్, కేశర్వాని .. ఇద్దరూ బీడీ వ్యాపారం చేసేవారు. అయితే, కేశర్వాని సుమారు రూ. 140 కోట్ల పన్ను ఎగవేసినట్లు తేలగా.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను తనిఖీల చేస్తున్న సమయంలో.. అతను నిర్మాణ రంగంలో ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇక, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ ఇంట్లో సోదాలు చేయగా మూడు మొసళ్లు ఉన్నట్లు గుర్తించారు. నివాసంలోని ఓ చిన్న కుంటలో అవి ఉండటంతో అటవీ శాఖను ఆదాయపు పన్నుశాఖ అధికారులు అలర్ట్ చేశారు.
Read Also: CM Revanth Reddy : 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం..
అయితే, కేశర్వాని ఇంట్లోనూ పలు బినామీ పేరుతో దిగుమి చేసుకున్న కార్లను ఐటీ అధికారులు గుర్తించారు. అందులో ఒక్క కారు కూడా అతడి కుటుంబం పేరిట లేదని తేలింది. ట్రాన్స్పోర్టు శాఖ నుంచి కార్లకు చెందిన సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఆ కార్లను ఎలా కొనుగోలు చేశారన్న దానిపై విచారణ చేస్తున్నారు. సాగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ తొలుత బిజినెస్ చేసేవాడు.. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన శాసనసభ్యుడిగా విజయం సాధించాడు. జిల్లా అధ్యక్షుడి పోస్టు కోసం కూడా తీవ్రంగా పోటీ చేశారు. ఆయన తండ్రి హర్నమ్ సింగ్ రాథోడ్ సైతం గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా విధులు నిర్వహించారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!