Live-In Partner: లివ్-ఇన్లో ఉన్న మహిళని చంపేసిన వ్యక్తి.. 8 నెలలుగా ఫ్రిజ్లో డెడ్బాడీ..
- అద్దె ఇంట్లోని ఫ్రిజ్లో మహిళ మృతదేహం..
- గతేడాది హత్యకు గురైనట్లు అనుమానం..
- విద్యుత్ సరఫరా నిలిపేయడంతో దుర్వాసన..
- దీంతో వెలుగులోకి వచ్చిన హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ దేవాస్ నగరంలో ఒక ఇంట్లో ఫ్రిజ్లో మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఈ కేసులు గతంలో ఈ ఇంట్లో అద్దెకు ఉన్న సంజయ్ పాటిదార్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు ధరించి, చేతులు మెడను కట్టి ఉంచిన స్థితిలో మహిళ డెడ్బాడీ కనిపించింది. మహిళ గత సంవత్సరం హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మహిళని పింకీ ప్రజాపతిగా గుర్తించారు.
పింకీ జూన్ 2024లో హత్యకు గురై ఉంటుందని అనుమానిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత 8 నెలలుగా మృతదేహాన్ని ఫ్రిజ్లోనే ఉంచాడు నిందితుడు. దుర్వాసన రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పొరుగింటి వారు ఇంటి యజమానికి ఫోన్ చేసి చెప్పడంతో, ఇంట్లోకి వెళ్లి చూడగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్రిజ్లోని మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
Read Also: Bihar Scam: ‘‘పిల్లలు లేని మహిళలని గర్భవతిని చేయండి, రూ.10 లక్షలు పొందండి’’..
ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ ఇండోర్లో నివసిస్తున్నాడు. శ్రీవాస్తవ ఈ ఇంటిని జూన్ 2023లో ఉజ్జయినికి చెందిన సంజయ్ పాటిదార్కి అద్దె ఇచ్చారు. పాటిదార్ 5 ఏళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరు భార్యభర్తలమని చెప్పి ఇరుగుపొరుగు వారిని నమ్మించారు. వివాహం చేసుకోవాలని ఒత్తిడి తేవడంతోనే పాటిదార్ తన స్నేహితుడి సాయంతో పింకీని చంపేసినట్లు తెలుస్తోంది. పాటిదార్కి అప్పటికే వివాహం అయింది.
ఇల్లు అద్దెకు తీసుకున్న ఒక ఏడాది తర్వాత పాటిదార్ ఈ ఇంటిని ఖాళీ చేశారు. అయితే, తన సామన్లను మాత్రం స్టడీరూమ్, మాస్టర్ బెడ్రూంలో ఉంచడం కొనసాగించాడు. త్వరలోనే ఖాళీ చేస్తానని చెప్పినట్లు ఓనర్ శ్రీవాస్తవకు చెప్పాడు. పాటిదార్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడని, ప్రస్తుతం ఇంటిలో ఉంటున్న అద్దెదారుడు ఇంట్లోని ఒక పోర్షన్ని తెరవాలని ఇంటి యజమానిని అడిగాడు. ఇంటి యజమాని ఇంటిలోని ఈ భాగాన్ని అద్దెదారుడికి చూపించాడు. కానీ పాటిదార్ వస్తువులు లోపల ఉండటంతో మళ్లీ అన్లాక్ చేశాడు. బుధవారం విద్యుత్ సరఫరా ఆపేయడంతో ఫ్రిజ్లో ఉన్న మహిళ మృతదేహం నుంచి కుళ్లిపోయిన వాసన రావడం ప్రారంభమైనట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పాటిదార్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!