MP: ప్రియురాలిని చంపి ఫ్రిజ్లో దాచిన ప్రియుడు.. 10 నెలల తర్వాత గుర్తింపు..
- లివ్ఇన్ రిలేషన్షిప్లో జంట
- పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో హత్య
- ప్రియురాలిని చంపి ఫ్రీజ్లో దాచిన ప్రియుడు
- 10 నెలల తర్వాత మృదేహాన్ని వెలికి తీసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ నగరంలోని ఓ ఇంట్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. ఈ మృతదేహం ఫ్రిజ్లో గుర్తించారు. పోలీసుల విచారణలో మృతురాలిని 30 ఏళ్ల ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతిగా గుర్తించారు. లివ్ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ప్రతిభ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె భాగస్వామి సంజయ్ పాటిదార్ ఈ హత్యకు పాల్పడ్డాడు. సంజయ్ తన స్నేహితుడు వినోద్తో కలిసి ప్రతిభను గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్లో దాచాడు. దుర్వాసన రావడంతో 10 నెలల తర్వాత ఈ విషయం వెల్లడైంది.
READ MORE: Delhi Alert: ఢిల్లీకి ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన చేసిన ఐఎండీ
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
దేవాస్ ఎస్పీ పునీత్ గెహ్లాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంక్ నోట్ ప్రెస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ ధామ్ కాలనీ ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ ఇండోర్లో నివసిస్తున్నాడు. ఉజ్జయినిలోని మౌలానా గ్రామానికి చెందిన సంజయ్ పాటిదార్ తన లైవ్-ఇన్ భాగస్వామి ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతితో కలిసి ధీరేంద్ర శ్రీవాస్తవ ఇంట్లో జూలై 2023 నుంచి నివసిస్తున్నారు. సంజయ్ జూన్ 2024లో ఇల్లు ఖాళీ చేసాడు. కానీ ఇంట్లోని రెండు గదులు ఖాళీ చేయలేదు. తాను కొన్ని వస్తువులు ఉంచుకున్నానని, తర్వాత వచ్చి తీసుకెళ్తానని ఇంటి యజమానికి చెప్పాడు. నెలనెలా అద్దెను ఇండోర్లో నివసిస్తున్న యజమానికి ఆన్లైన్లో బదిలీ చేస్తున్నాడు.
READ MORE: HMPV Case : మరో హెచ్ఎంపీవీ కేసు.. 10 నెలల చిన్నారిలో బయటపడ్డ వైరస్!
అద్దెదారు సంజయ్ పాటిదార్ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. ఇటీవల కొత్త అద్దెదారు వచ్చాడు. కొత్తగా వచ్చిన వ్యక్తి తాళం వేసి ఉన్న రెండు గదుల తాళాలు ఇవ్వమని కోరాడు. ఇంటిని తెరిచి చూశారు. కానీ.. ఫ్రిజ్లో తీవ్ర దుర్వాసన వస్తోంది. అనుమానించిన ఓనర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఇన్స్పెక్టర్ అమిత్ సోలం మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలి వయస్సు 30 సంవత్సరాలు ఉంటుందని నిర్ధారించారు. ఈ హత్య 2024 జూన్లో జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!