PM Modi: రేపు మధ్యప్రదేశ్లో మోడీ పర్యటన.. కెన్-బెత్వా నదుల లింక్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన
- రేపు మధ్యప్రదేశ్లో మోడీ పర్యటన
- కెన్-బెత్వా నదుల లింకు ప్రాజెక్ట్కు శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ బుధవారం మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంగళవారం తెలిపారు. డిసెంబర్ 25న కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మధ్యప్రదేశ్లోని 10 జిల్లాల్లోని దాదాపు 44 లక్షల మందికి, ఉత్తరప్రదేశ్లోని 21 లక్షల మందికి తాగునీరు అందనుంది. దీనికి రూ. 44,605 కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: HYDRA: ఎన్ఆర్ఎస్సీ కార్యాలయానికి హైడ్రా కమిషనర్.. శాటిలైట్ ఇమేజీలు పరిశీలన
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
నదుల అనుసంధానానికి మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి కలను సాకారం చేసేందుకు ప్రధాని మోడీ చొరవ తీసుకున్నారని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. బుధవారం మధ్యప్రదేశ్లోని ఖజురహోలో కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 103 మెగావాట్ల జలవిద్యుత్, 27 మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 గ్రామాలకు చెందిన దాదాపు 7.18 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులకు సాగునీరు పుష్కలంగా అందడంతో పాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీరు అందుతుందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Amitabh Jha: యూఎన్ శాంతి పరిరక్షక దళం కమాండర్ బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణం..
ఈ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడంతో పాటు టూరిజం కూడా అభివృద్ధి చెంది కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. కరువు పీడిత బుందేల్ఖండ్ ప్రాంతంలో భూగర్భ జలాల పరిస్థితి కూడా మెరుగుపడుతుందని సీఎం చెప్పారు. ప్రాజెక్ట్ కింద పన్నా టైగర్ రిజర్వ్లోని కెన్ నదిపై 77 మీటర్ల ఎత్తు మరియు 2.13 కిలోమీటర్ల పొడవు గల దౌధన్ ఆనకట్ట, రెండు సొరంగాలు నిర్మించనున్నారు. డ్యాంలో 2,853 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ప్రధాని మోడీ సమక్షంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి త్రైపాక్షిక అవగాహన ఒప్పందం జరిగింది. మార్చి 22, 2021న సంతకాలు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది తొలగింపు.. త్వరలో మరో 200 మంది!
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!