PM Modi: రేపు మధ్యప్రదేశ్లో మోడీ పర్యటన.. కెన్-బెత్వా నదుల లింక్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన
- రేపు మధ్యప్రదేశ్లో మోడీ పర్యటన
- కెన్-బెత్వా నదుల లింకు ప్రాజెక్ట్కు శంకుస్థాపన
ప్రధాని మోడీ బుధవారం మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంగళవారం తెలిపారు. డిసెంబర్ 25న కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మధ్యప్రదేశ్లోని 10 జిల్లాల్లోని దాదాపు 44 లక్షల మందికి, ఉత్తరప్రదేశ్లోని 21 లక్షల మందికి తాగునీరు అందనుంది. దీనికి రూ. 44,605 కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: HYDRA: ఎన్ఆర్ఎస్సీ కార్యాలయానికి హైడ్రా కమిషనర్.. శాటిలైట్ ఇమేజీలు పరిశీలన
Also Read
నదుల అనుసంధానానికి మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి కలను సాకారం చేసేందుకు ప్రధాని మోడీ చొరవ తీసుకున్నారని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. బుధవారం మధ్యప్రదేశ్లోని ఖజురహోలో కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 103 మెగావాట్ల జలవిద్యుత్, 27 మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 గ్రామాలకు చెందిన దాదాపు 7.18 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులకు సాగునీరు పుష్కలంగా అందడంతో పాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీరు అందుతుందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Amitabh Jha: యూఎన్ శాంతి పరిరక్షక దళం కమాండర్ బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణం..
ఈ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడంతో పాటు టూరిజం కూడా అభివృద్ధి చెంది కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. కరువు పీడిత బుందేల్ఖండ్ ప్రాంతంలో భూగర్భ జలాల పరిస్థితి కూడా మెరుగుపడుతుందని సీఎం చెప్పారు. ప్రాజెక్ట్ కింద పన్నా టైగర్ రిజర్వ్లోని కెన్ నదిపై 77 మీటర్ల ఎత్తు మరియు 2.13 కిలోమీటర్ల పొడవు గల దౌధన్ ఆనకట్ట, రెండు సొరంగాలు నిర్మించనున్నారు. డ్యాంలో 2,853 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ప్రధాని మోడీ సమక్షంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి త్రైపాక్షిక అవగాహన ఒప్పందం జరిగింది. మార్చి 22, 2021న సంతకాలు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది తొలగింపు.. త్వరలో మరో 200 మంది!
తాజావార్తలు
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
-
Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
-
Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు
-
SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?