PM Modi: రేపు మధ్యప్రదేశ్లో మోడీ పర్యటన.. కెన్-బెత్వా నదుల లింక్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన
- రేపు మధ్యప్రదేశ్లో మోడీ పర్యటన
- కెన్-బెత్వా నదుల లింకు ప్రాజెక్ట్కు శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ బుధవారం మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంగళవారం తెలిపారు. డిసెంబర్ 25న కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మధ్యప్రదేశ్లోని 10 జిల్లాల్లోని దాదాపు 44 లక్షల మందికి, ఉత్తరప్రదేశ్లోని 21 లక్షల మందికి తాగునీరు అందనుంది. దీనికి రూ. 44,605 కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: HYDRA: ఎన్ఆర్ఎస్సీ కార్యాలయానికి హైడ్రా కమిషనర్.. శాటిలైట్ ఇమేజీలు పరిశీలన
Also Read
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
నదుల అనుసంధానానికి మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి కలను సాకారం చేసేందుకు ప్రధాని మోడీ చొరవ తీసుకున్నారని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. బుధవారం మధ్యప్రదేశ్లోని ఖజురహోలో కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 103 మెగావాట్ల జలవిద్యుత్, 27 మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 గ్రామాలకు చెందిన దాదాపు 7.18 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులకు సాగునీరు పుష్కలంగా అందడంతో పాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీరు అందుతుందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Amitabh Jha: యూఎన్ శాంతి పరిరక్షక దళం కమాండర్ బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణం..
ఈ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడంతో పాటు టూరిజం కూడా అభివృద్ధి చెంది కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. కరువు పీడిత బుందేల్ఖండ్ ప్రాంతంలో భూగర్భ జలాల పరిస్థితి కూడా మెరుగుపడుతుందని సీఎం చెప్పారు. ప్రాజెక్ట్ కింద పన్నా టైగర్ రిజర్వ్లోని కెన్ నదిపై 77 మీటర్ల ఎత్తు మరియు 2.13 కిలోమీటర్ల పొడవు గల దౌధన్ ఆనకట్ట, రెండు సొరంగాలు నిర్మించనున్నారు. డ్యాంలో 2,853 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ప్రధాని మోడీ సమక్షంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి త్రైపాక్షిక అవగాహన ఒప్పందం జరిగింది. మార్చి 22, 2021న సంతకాలు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది తొలగింపు.. త్వరలో మరో 200 మంది!
తాజావార్తలు
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?