అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరి కొద్ది రోజుల్లో అధ్యక్ష పదవిని వదులుకోనున్నారు. గతంలో అక్రమంగా తుపాకీ కలిగి ఉండటం, పన్ను ఎగవేత కేసులో ఆయన తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించారు. తన కొడుకు క్షమాపణ కోసం అధ్యక్ష పదవిని ఉపయోగించబోనని ఇచ్చిన హామీపై యూటర్న్ తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు.. ఈ క్షమాపణ నేరానికి శిక్ష పడకుండా హంటర్ను కాపాడుతుంది.
ఒక హోటల్ నుంచి మాజీ ఎమ్మెల్యే డబ్బులు మాయం అయిన ఉదంతం కరీంనగర్ లో కలకలం సృష్టించింది. ఇటీవల దీక్షాధీవస్ సభ జనసమీకరణ కోసం భారీగా డబ్బుల ఖర్చు చేశారు. నియోజకవర్గం ఇన్ఛార్జిలకు పదిలక్షల రూపాయల చొప్పున సర్ధుబాటు చేసినట్లు సమాచారం. పదిలక్షలలో కేవలం ఐదులక్షలే ఖర్చు చేశారని.. కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాగా.. కార్యక్రమం ముగిసిన తరువాత వి పార్క్ హోటల్ లోని రూం నంబర్ 209 లో కార్యకర్తలతో కలిసి విందు ఏర్పాటు చేశారు. ఉదయం…
స్కాట్లాండ్లోని చారిత్రక లైట్హౌస్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇంజినీర్లు ఓ సీసాలో 132 ఏళ్ల నాటి లేఖను గుర్తించారు. లెటర్లో రాసింది చదివిన ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు అందులో రాశారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. 36 ఏళ్ల ఇంజనీర్ రాస్ రస్సెల్ ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి బీబీసీకి చెప్పారు.
మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఢిల్లీ మెట్రోకు చెందిన వీడియోలైతే.. తరచూ చర్చలో ఉంటాయి. ఇటీవల వైరల్ అయిన వీడియోలో.. ఒక అమ్మాయి చిరిగిన దుస్తులతో మెట్రోలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఇప్పుడు మరో మెట్రోకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కానీ ఈ వీడియో ఢిల్లీ మెట్రోకు సంబంధించింది కాదు.
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తన విదేశీ పర్యటనలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక చిత్రాల వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పంచుకున్నారు. ఈ వీడియోను పంచుకుంటూ.. ప్రధాని మోడీ క్యాప్షన్లో " భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది!.. నేను ఎక్కడికి వెళ్లినా, నా దేశ చరిత్ర, సంస్కృతి పట్ల నాకు అపారమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఈ ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది." అని రాసుకొచ్చారు.
మసీదులో ఆలయానికి సంబంధించిన ఆధారాలు దొరికితే అక్కడ గొప్ప ఆలయాన్ని నిర్మిస్తామని బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. దీనితో పాటు.. 2029 నాటికి భారతదేశం హిందూ దేశంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయానికి రాజా సింగ్ చేరుకున్నారు. మహాకాళ్ దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న మతపరమైన సంక్షోభాన్ని బాబా మహాకాళ్ ఆశీస్సులతో ఎదుర్కోవాలని ఆకాంక్షించారు.
అన్ని వయసుల వ్యక్తులు తమ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన శరీరం ఉంటే ఏమైనా సాధించగలం. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఒక నిర్దిష్ట వయసు తర్వాత శరీరం బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. వయసు సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. ఎవరి జీవితంలోనైనా 60 ఏళ్ల వయస్సు చాలా ముఖ్యమైన దశ.
వాయు కాలుష్యం.. సహజ వాయువులతో నిండిన వాతావరణాన్ని కలుషితం చేసి, మనుషుల ఆరోగ్యంతో పాటు జీవావరణ సమతౌల్యతను, జీవరాశుల ఉనికిని నాశనం చేస్తుంది. శ్వాసక్రియ నుంచి స్ట్రాటో ఆవరణలోని ఓజోన్ పొర వరకు అన్నింటినీ దెబ్బతీస్తుంది. చెట్లను నరికివేయడం, జనాభా పెరగడం వంటి అనేక కారణాల వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగి మానవ ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే తరాలు స్వచ్ఛమైన గాలి పీల్చేలా పర్యావరణాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని దారుణం జరిగింది. మౌగంజ్ జిల్లాలో కదులుతున్న అంబులెన్స్లో ఇద్దరు వ్యక్తులు 16 ఏల్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌగంజ్ జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉన్న హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 25న ఈ సంఘటన జరిగింది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంపై విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. రాజధానిలో మహిళలపై జరుగుతున్న గ్యాంగ్ వార్, దోపిడీ, నేర ఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన చెందారు.