Madhya Pradesh: మైనర్ బాలికపై అంబులెన్స్లో సామూహిక అత్యాచారం..
- మధ్యప్రదేశ్లో దారుణం..
- మైనర్ బాలిక కిడ్నాప్..
- అంబులెన్స్లో సామూహిక అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని దారుణం జరిగింది. మౌగంజ్ జిల్లాలో కదులుతున్న అంబులెన్స్లో ఇద్దరు వ్యక్తులు 16 ఏల్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌగంజ్ జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉన్న హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 25న ఈ సంఘటన జరిగింది.
Read Also: Minister Nadendla Manohar: రైతులకు అండగా ఉంటాం.. దళారులను ప్రోత్సహించొద్దు..
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
ఇద్దరు వ్యక్తులు తనను బలవంతంగా కిడ్నాప్ చేసి జననీ ఎక్స్ప్రెస్ అంబులెన్స్లో బలవంతంగా ఎక్కించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని ‘‘108 అంబులెన్స్’’ అని కూడా పిలుస్తారు. జననీ ఎక్స్ప్రెస్ అంబులెన్స్ను మధ్యప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోని తల్లులు, అనారోగ్యంతో ఉన్న శిశువులు, పేద కుటుంబాల అత్యవసర రవాణా సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది.
నిందితులను వీరేంద్ర చతుర్వేది (అంబులెన్స్ డ్రైవర్), అతని మిత్రుడు రాజేష్ కేతవ్గా గుర్తించారు. బుధవారం రాత్రి వీరిద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు మౌగంజ్ జిల్లాలోని నైగర్హి తహసీల్ నివాసితులు. ఘటన జరిగిన ప్రాంతంమైన హనుమాన తహసీన్ నుంచి నిందితులు గ్రామం 50 కి.మీ దూరంలో ఉంది. ‘‘సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ నవంబర్ 25న బాధితురాలు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించబడింది మరియు సోదాలు ప్రారంభించబడ్డాయి. నిందితులిద్దరినీ నగరి నుండి బుధవారం అరెస్టు చేశాము’’ అని మౌగంజ ఎస్సీ సర్నా ఠాకూర్ అన్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..