Raja Singh: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్.. ఏమన్నారంటే?
- మసీదులో ఆలయానికి సంబంధించిన ఆధారాలు దొరికితే ఆలయం నిర్మిస్తాం
- 2029 నాటికి భారత్ హిందూ దేశంగా మారుతుంది
- దేశంలో లవ్ జిహాద్ పెరిగిపోతోంది
- ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయంలో రాజాసింగ్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మసీదులో ఆలయానికి సంబంధించిన ఆధారాలు దొరికితే అక్కడ గొప్ప ఆలయాన్ని నిర్మిస్తామని బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. దీనితో పాటు.. 2029 నాటికి భారతదేశం హిందూ దేశంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయానికి రాజా సింగ్ చేరుకున్నారు. మహాకాళ్ దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న మతపరమైన సంక్షోభాన్ని బాబా మహాకాళ్ ఆశీస్సులతో ఎదుర్కోవాలని ఆకాంక్షించారు. భారతదేశం హిందూ దేశంగా అవతరించే దిశలో తన విశ్వాసం దృఢంగా ఉందని, ఇది 2029 నాటికి నెరవేరుతుందని ఆయన అన్నారు.
READ MORE: YS Jagan: అదానీ వ్యవహారంపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. వారిపై పరువునష్టం దావా..!
Also Read
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
దేశంలో లవ్ జిహాద్ పెరిగిపోతోంది..
దేశంలో పెరుగుతున్న ‘లవ్ జిహాద్’, గోహత్యపై టి రాజా సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లవ్ జిహాద్ పెరిగిపోవడంతో పాటు ఆవు మాంసం ఎగుమతి అవుతున్నదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడుతూ.. నరేంద్ర మోడీ లాంటి ప్రధాని భవిష్యత్తులో దొరకరని అన్నారు. మోడీ ఆరోగ్యం బాగుండాలని, భారతదేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని బాబా మహకల్ ని ప్రార్థించినట్లు తెలిపారు.
READ MORE: YS Jagan: ఏపీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అది.. నేను మంచోడినా..? చంద్రబాబు మంచోడా..?
‘హిందూ రాష్ట్రం’ అంశంపై బీజేపీ ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. భారతదేశం ఎప్పటికీ హిందూ దేశంగా మారదని నమ్మే వారు తమ అపోహను తొలగించుకోవాలని అన్నారు. రామమందిర నిర్మాణం, కశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించడాన్ని ఉదాహరిస్తూ.. గతంలో రామమందిరం కట్టబోమని చెప్పారని, నేడు ఈ ఆలయాన్ని నిర్మించారని అన్నారు. 2029 నాటికి భారతదేశం హిందూ దేశంగా మారుతుందని, గోహత్యను కూడా నిషేధిస్తామని రాజా సింగ్ పేర్కొన్నారు. మత స్థలాల సర్వేను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అయితే సర్వేలో మసీదు కింద గుడి ఉన్నట్లు ఆధారాలు దొరికితే అక్కడ గొప్ప ఆలయాన్ని నిర్మిస్తామన్నారు.
తాజావార్తలు
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
-
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!