Arvind Kejriwal: ఢిల్లీని క్రైమ్ క్యాపిటల్గా మార్చారు.. అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన
- ఢిల్లీలో శాంతిభద్రతలపై కేజ్రీవాల్ ప్రశ్నలు
- ఢిల్లీ నేరాల రాజధానిగా మారిందన్న మజీ సీఎం
- బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపణ
- బీజేపీ ఏం దాచాలనుకుంటోందని కేజ్రీవాల్ ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంపై విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. రాజధానిలో మహిళలపై జరుగుతున్న గ్యాంగ్ వార్, దోపిడీ, నేర ఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన చెందారు.
READ MORE: CM Revanth Reddy: కుల సర్వేలో కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న సీఎం..
Also Read
ఢిల్లీ అత్యంత భద్రత లేని రాజధానిగా ప్రజలు పిలుస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ఈరోజు ఢిల్లీ ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు. “10 సంవత్సరాల క్రితం.. ప్రజలు నాకు విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య వంటి సమస్యలు తీర్చాలని నన్ను గెలిపించారు. మేము బాగా పనిచేసి ఆయా సమస్యలను పరిష్కరించాం. కానీ ఢిల్లీలో శాంతిభద్రతలకు బాధ్యత వహించే వారు దానిని నిర్వహించడంలో విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ నేరాల రాజధానిగా మారింది. 2022లో 522 హత్యలు జరిగాయి. మహిళలు, వ్యాపారులు భయంతో బతుకుతున్నారు. బాధితుల్లో ఒకరైన రోషన్లాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను నిన్న నాంగ్లోయ్కు వెళ్లాను. అక్కడున్న బీజేపీ నాయకులు నన్ను అక్కడికి వెళ్లనివ్వలేదు. బీజేపీ వాళ్లు ఏం దాచాలనుకుంటున్నారో తెలియడం లేదు. శాంతిభద్రతలు బాగానే ఉంటే నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు కదా? అని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.
READ MORE:Maharashtra Cabinet: కుదిరిన మహారాష్ట్ర కేబినెట్.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..?
ఇదిలా ఉండగా.. తాజాగా దేశ రాజధానిలో పేలుడు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం స్థానికులకు వినిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక దళం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడుకు కారణమేమిటనే విషయమై ఆరా తీస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం.. గురువారం ఉదయం 11:58 గంటలకు పేలుడు గురించి సమాచారం అందింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు పంపించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఉన్న బన్సీ స్వీట్స్ ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. అంతకుముందు అక్టోబర్ 20న కూడా ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!