Arvind Kejriwal: ఢిల్లీని క్రైమ్ క్యాపిటల్గా మార్చారు.. అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన
- ఢిల్లీలో శాంతిభద్రతలపై కేజ్రీవాల్ ప్రశ్నలు
- ఢిల్లీ నేరాల రాజధానిగా మారిందన్న మజీ సీఎం
- బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపణ
- బీజేపీ ఏం దాచాలనుకుంటోందని కేజ్రీవాల్ ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంపై విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. రాజధానిలో మహిళలపై జరుగుతున్న గ్యాంగ్ వార్, దోపిడీ, నేర ఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన చెందారు.
READ MORE: CM Revanth Reddy: కుల సర్వేలో కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న సీఎం..
Also Read
- Shubman Gill: "నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా".. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
- Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
ఢిల్లీ అత్యంత భద్రత లేని రాజధానిగా ప్రజలు పిలుస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ఈరోజు ఢిల్లీ ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు. “10 సంవత్సరాల క్రితం.. ప్రజలు నాకు విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య వంటి సమస్యలు తీర్చాలని నన్ను గెలిపించారు. మేము బాగా పనిచేసి ఆయా సమస్యలను పరిష్కరించాం. కానీ ఢిల్లీలో శాంతిభద్రతలకు బాధ్యత వహించే వారు దానిని నిర్వహించడంలో విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ నేరాల రాజధానిగా మారింది. 2022లో 522 హత్యలు జరిగాయి. మహిళలు, వ్యాపారులు భయంతో బతుకుతున్నారు. బాధితుల్లో ఒకరైన రోషన్లాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను నిన్న నాంగ్లోయ్కు వెళ్లాను. అక్కడున్న బీజేపీ నాయకులు నన్ను అక్కడికి వెళ్లనివ్వలేదు. బీజేపీ వాళ్లు ఏం దాచాలనుకుంటున్నారో తెలియడం లేదు. శాంతిభద్రతలు బాగానే ఉంటే నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు కదా? అని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.
READ MORE:Maharashtra Cabinet: కుదిరిన మహారాష్ట్ర కేబినెట్.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..?
ఇదిలా ఉండగా.. తాజాగా దేశ రాజధానిలో పేలుడు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం స్థానికులకు వినిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక దళం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడుకు కారణమేమిటనే విషయమై ఆరా తీస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం.. గురువారం ఉదయం 11:58 గంటలకు పేలుడు గురించి సమాచారం అందింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు పంపించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఉన్న బన్సీ స్వీట్స్ ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. అంతకుముందు అక్టోబర్ 20న కూడా ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది.
తాజావార్తలు
-
Shubman Gill: “నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా”.. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
-
Bollywood Controversy: ‘ఈమె ఎలాంటి సీత?’.. సాయి పల్లవిపై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!