Arvind Kejriwal: ఢిల్లీని క్రైమ్ క్యాపిటల్గా మార్చారు.. అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన
- ఢిల్లీలో శాంతిభద్రతలపై కేజ్రీవాల్ ప్రశ్నలు
- ఢిల్లీ నేరాల రాజధానిగా మారిందన్న మజీ సీఎం
- బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపణ
- బీజేపీ ఏం దాచాలనుకుంటోందని కేజ్రీవాల్ ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంపై విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. రాజధానిలో మహిళలపై జరుగుతున్న గ్యాంగ్ వార్, దోపిడీ, నేర ఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన చెందారు.
READ MORE: CM Revanth Reddy: కుల సర్వేలో కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న సీఎం..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఢిల్లీ అత్యంత భద్రత లేని రాజధానిగా ప్రజలు పిలుస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ఈరోజు ఢిల్లీ ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు. “10 సంవత్సరాల క్రితం.. ప్రజలు నాకు విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య వంటి సమస్యలు తీర్చాలని నన్ను గెలిపించారు. మేము బాగా పనిచేసి ఆయా సమస్యలను పరిష్కరించాం. కానీ ఢిల్లీలో శాంతిభద్రతలకు బాధ్యత వహించే వారు దానిని నిర్వహించడంలో విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ నేరాల రాజధానిగా మారింది. 2022లో 522 హత్యలు జరిగాయి. మహిళలు, వ్యాపారులు భయంతో బతుకుతున్నారు. బాధితుల్లో ఒకరైన రోషన్లాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను నిన్న నాంగ్లోయ్కు వెళ్లాను. అక్కడున్న బీజేపీ నాయకులు నన్ను అక్కడికి వెళ్లనివ్వలేదు. బీజేపీ వాళ్లు ఏం దాచాలనుకుంటున్నారో తెలియడం లేదు. శాంతిభద్రతలు బాగానే ఉంటే నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు కదా? అని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.
READ MORE:Maharashtra Cabinet: కుదిరిన మహారాష్ట్ర కేబినెట్.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..?
ఇదిలా ఉండగా.. తాజాగా దేశ రాజధానిలో పేలుడు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం స్థానికులకు వినిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక దళం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడుకు కారణమేమిటనే విషయమై ఆరా తీస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం.. గురువారం ఉదయం 11:58 గంటలకు పేలుడు గురించి సమాచారం అందింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు పంపించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఉన్న బన్సీ స్వీట్స్ ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. అంతకుముందు అక్టోబర్ 20న కూడా ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!