Godavari Floods: గోదావరి ఉగ్రరూపంతో అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో వరద భయం నెలకొంది. కూనవరం, శబరి - గోదావరి సంగమం వద్ద నీటిమట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. ఇళ్లల్లోని సామగ్రితో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
వరదలు వచ్చినప్పుడు లంక గ్రామాలలో పడవలు, పంట్లు లో ప్రయాణించడం సహజం.. కానీ కాలాలు మారిన అక్కడి వారి కష్టాలు తీరడం లేదు.. దశాబ్దాలు తరబడి వంతెనల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.. అన్నీ పనులు ఆమోదం లభించింది అనుకునే లోపు ఏదో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి… తమ జీవితాలు జీవన ప్రమాణాలు మారవు అని వారికి అర్థం అయిపోయినట్లు ఉంది.. ఈ కష్టాలు తప్పవని డిసైడ్ అయిపోతున్నారు.. బడి పిల్లలు అయితే బిక్కుబిక్కుమంటూ చదువుకోవడానికి వెళ్లాల్సి…
గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది.. ఇప్పటికే భద్రచలం దగ్గర 51 అడుగులకు పైగా గోదావరి ప్రవాహం కొనసాగుతుండగా.. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది.. ఇక, కోనసీమ లంక గ్రామాలను అప్రమత్తం చేసింది అధికార యంత్రాంగం.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో మళ్లీ వరద కష్టాలు మొదలయ్యాయి.. Read Also:…
గత నెలలో గోదావరి ముంపు దెబ్బ నుంచి ఇంకా సరిగా తేరుకోలేదు.. అప్పుడే మళ్లీ గోదారమ్మ విరుచుకుపడుతుంది.. ఆగస్టులో వర్షాలు, వరదలు ఉంటాయని జులైలో ముహూర్తాలు పెట్టుకున్నా.. కొన్ని పెళ్లిళ్లలకు ఇబ్బందులు తప్పలేదు.. ట్రాక్టర్లపై.. చివరకు పడవలపై మరో ప్రాంతానికి వెళ్లి పెళ్లిళ్లు జరిపించిన ఘటనలు వెలుగు చూశాయి.. ఇప్పుడు.. గోదారమ్మ ముంపే కాదు.. ముహూర్తాలు కూడా ముంచుకొస్తున్నాయి.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ఆ తంతు జరిపించడం లంక గ్రామాల వాసులకు సవాల్గా మారింది.. ఇళ్లు, గ్రామాలను…