Lanka villages: లంక గ్రామాల్లో ప్రజల అవస్థలు.. ఆ బ్రిడ్జి వచ్చేదాకా తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరదలు వచ్చినప్పుడు లంక గ్రామాలలో పడవలు, పంట్లు లో ప్రయాణించడం సహజం.. కానీ కాలాలు మారిన అక్కడి వారి కష్టాలు తీరడం లేదు.. దశాబ్దాలు తరబడి వంతెనల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.. అన్నీ పనులు ఆమోదం లభించింది అనుకునే లోపు ఏదో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి… తమ జీవితాలు జీవన ప్రమాణాలు మారవు అని వారికి అర్థం అయిపోయినట్లు ఉంది.. ఈ కష్టాలు తప్పవని డిసైడ్ అయిపోతున్నారు.. బడి పిల్లలు అయితే బిక్కుబిక్కుమంటూ చదువుకోవడానికి వెళ్లాల్సి వస్తుంది.. లంక గ్రామాలలో ఏడో తరగతి వరకే స్కూలు ఉంటుంది.. అక్కడ పాఠాలు చెప్పడానికి వచ్చే మాస్టార్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు.. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకురు నుండి బలుసు తిప్ప గ్రామం వరకు ఉన్న 10 గ్రామాలను, ఐ పోలవరం మండలం గుత్తెనదీవి మూల పొలం కలుపుతూ గోదావరి నది పాయపై వంతెన నిర్మించాలని అనుకున్నారు.. 2009 లో అప్పటి సీఎం వైఎస్ రామాలయంపేట జి మూలపాలెం 350 మీటర్ల వంతెన నిర్మాణానికి 22 కోట్లతో శంకుస్థాపన చేశారు.. ఆ బ్రిడ్జి నిర్మాణానికి పిల్లర్లు వేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించలేదు దానిపై కోర్టుకు వెళ్లడంతో ఆ పనులు అక్కడే ఆగిపోయాయి.. కోర్టు కేసుల తర్వాత ఈ ప్రభుత్వంలో మోక్షం లభించింది.. 2021లో బ్రిడ్జి నిర్మాణం అంచనాని 76 కోట్లకు పెంచుతు ప్రభుత్వం టెండర్లుని ఆహ్వానించింది… కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
Read Also: Biryani new record: బిర్యానీ క్రేజ్ అంతే.. ఏడేళ్లుగా అదే టాప్.. నిమిషానికి 137 ఆర్డర్లు..
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే కాట్రేనికోన మండలం పల్లంకురు పరిసర ప్రాంతాల్లో 30 వేల మందికి ఉపయోగము ఉంటుంది.. ముఖ్యంగా బలుసు తిప్ప పరిసర ప్రాంత మత్స్యకారులు తమ మత్స్య సంపదను అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది.. దాంతోపాటు ఈ మధ్యకాలంలోనే సీఎం గోగుల్లంక వారిదికి శంకుస్థాపన చేశారు.. ఈ వంతెన నిర్మాణానికి టెండర్లు పిలవగా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు.. దాంతో వాటి పనులు కూడా ప్రారంభం కాలేదు.. పడవలు ,పంట్లు మీద దాటించాలంటే లంక గ్రామస్తుల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా రావాలన్నా వెళ్లాలన్న తలకు మించిన భారం అవుతుంది.. హాస్పిటల్ అవసరాల నిమిత్తం వెళ్లే వాళ్ళు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కూడా అవకాశం ఉండడం లేదు.. స్థానికులు తరచూ వాహనాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తీసుకొని వెళ్తున్నారు ఒక్కొక్కసారి ప్రమాదకరం గా ఎక్కువ మందితో ప్రయాణం చేయాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. దాని వలన ఇబ్బందులు తెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.. ఒకవేళ రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే దాదాపు 30 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. వరదలు వచ్చినప్పుడు ఏదో హంగామా సృష్టించే అధికారులు ప్రజాప్రతినిధులు తర్వాత అవకాశం ఉన్నప్పుడు కన్నెత్తి కూడా చూడడం లేదు. దాంతో ఇక్కడి స్థానికులకి కష్టాలు అలవాటైపోయాయి.. ఎన్నిసార్లు మొర పెట్టుకున్న ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు. ఒక్కొక్కసారి ఆ ప్రవాహంలో పడిపోయే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?