Godavari floods: గోదావరి ఉగ్రరూపం.. లంక గ్రామాలకు మళ్లీ వరద కష్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది.. ఇప్పటికే భద్రచలం దగ్గర 51 అడుగులకు పైగా గోదావరి ప్రవాహం కొనసాగుతుండగా.. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది.. ఇక, కోనసీమ లంక గ్రామాలను అప్రమత్తం చేసింది అధికార యంత్రాంగం.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో మళ్లీ వరద కష్టాలు మొదలయ్యాయి..
Read Also: Election Commission Shock to KA Paul: కేఏ పాల్కు షాక్… ప్రజాశాంతి పార్టీ గుర్తింపు రద్దు..!
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
గోదావరి ఉగ్రరూపంతో కోనసీమ లంక గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.. అయినవిల్లి మండలం ఎదురు బిడియం కాజ్ వే వరద నీటిలో మునిగిపోవడంతో.. నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి… దీంతో, పీకల్లోతు నీళ్లలో గోదావరి వరద దాటుతున్నారు లంక గ్రామాల ప్రజలు.. మహిళలు, విద్యార్థులు తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.. పరిస్థితి ఇలా ఉన్నా.. అధికారులు ట్రాక్టర్ లేదా పడవలు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. లంక గ్రామాలకు వంతెనల నిర్మాణం జరగకపోవడంతో వరద కష్టాలు తప్పడంలేదని వాపోతున్నారు.. ఇక, పి.గన్నవరం మండలం చాకలిపాలెం- కనకాయలంక కాజ్వే కూడా నీటి మునిగింది.. దీంతో, పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు స్థానికులు.. మొత్తంగా.. జులై నుంచి దఫదఫాలుగా భారీ వర్షాలు, వరదలతో లంక గ్రామాల్లో ఇబ్బందులు తప్పడంలేదు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!