DEERS Missing in Floods: వరదలకు కొట్టుకుపోతున్న జింకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీవర్షాలు, వరదలు జనానికే కాదు నోరులేని జీవాలకు కూడా ఇబ్బందికరంగా మారాయి. గోదావరి లంకల్లో ఉండే జింకలకు గోదావరి వరదలు శాపంగా మారాయి. గోదావరి వరద ఉధృతికి లంకలు మునిగిపోయి జింకలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. కాపాడడానికి స్థానికులు చేస్తున్నా ప్రయత్నాలు విఫలమయ్యాయి. కళ్ల ఎదుటే సుమారు 300 వరకు ఉన్న జింకలు గోదావరిలో ఒక్కొక్కటి కొట్టుకుపోవడం చూపరులకు కంటతడి పెట్టిస్తోంది. కోనసీమ జిల్లాలోని గోదావరి నది మధ్యలో ఉండే పచ్చిక బయళ్ళ చిగుళ్ళు తింటూ చెంగు చెంగున గంతులేస్తూ జీవించే జంకలకు వరదలు శాపంగా మారాయి. వరద ఉదృతి అధికంగా ఉండటంతో ఈ జింకలన్నీ నీటి ప్రవాహనికి కొట్టుకుపోతున్నాయి.
కోనసీమ జిల్లాలో సుమారు 300 పైబడి జింకలు, లేళ్లు ఉన్నాయి. అయితే ఇవి వరదనీటి ప్రవాహం అధికమవడంతో లంకలు మునిగిపోయాయి. దీంతో ఇవి ఒక్కొక్కటిగా గోదావరిలో కొట్టుకుపోతున్నాయి. ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి, కొత్తపేట మండలం నారాయణలంకలతో పాటు కడియం మండలం పొట్టిలంకల్లో కొన్ని జింకలు ఒడ్డుకు చేరుకున్నాయి. వీటిలో పొట్టిలంక వద్ద గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోతున్న నాలుగు జింకలను రైతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
అయితే ఒక జింక ఒడ్డుకు చేరినప్పటికీ కుక్కల దాడిలో మృతి చెందింది. దీనికి అటవీ శాఖ అధికారులు శవపంచనామా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా వచ్చే వరదలు ఈ వన్యప్రాణులకు శాపంగా మారుతున్నాయి. జింకల్ని పట్టుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదంటున్నారు అధికారులు. పులసలలంకలో 1500 గొర్రెలు చిక్కుకుపోయాయి. అధికారులు ఎంతగానో శ్రమించి వాటిని బోట్లు, పంట్ల ద్వారా కాపాడారు. బయటకు తరలించారు. జింకల్ని పట్టుకోవడం కుదరదని, మనుషుల్ని చూడగానే అవి పారిపోతుంటాయని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!