Chandrababu Naidu: 21, 22 తేదీల్లో వరదప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో భారీవర్షాలు, గోదావరి వరదలతో ఏపీలో పరిస్థితి దయనీయంగా మారింది. వరదలతో లంక గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) . ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు ఏర్పాట్లు చేశారు. గాల్లో తిరిగితే సీఎం జగనుకు ప్రజల వరద కష్టాలు ఏం తెలుస్తాయి. పీకల్లోతు వరదల్లో ప్రజలు మునిగి ఉంటే కాలికి బురద అంటకుండా హెలికాప్టరులో సీఎం జగన్ తిరుగుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు.
Railway Police Save Life: ప్రాణాలు పోయేవి.. వ్యక్తిని కాపాడిన రైల్వే పోలీసులు
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
వరదపై ప్రభుత్వ సన్నద్ధత అసలేం లేదు.. బాధితులకు సాయమూ లేదు..! నాలుగు రోజుల పాటు ప్రజలకు భోజనం, నీళ్లు ఇవ్వలేరా? పోలవరం కాఫర్ డ్యాం ఎత్తుపై ఇప్పుడు కొత్త డ్రామాలు.. మూడేళ్లు ఏం చేశారు..? వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని బాబు పిలుపునిచ్చారు. విపత్తుల సమయంలో ఆయా ప్రాంతాల్లో మంత్రులు గాని, ఇతర ప్రభుత్వ పెద్దలు గాని నిరంతరం పర్యవేక్షించే పరిస్థితి ఉండాలి. అయితే ఈ ప్రభుత్వంలో అదేమీ లేదు. జగన్ వరదలపై నాన్ సీరియస్ గా ఉండడం వల్లే కెబినెట్, ఇతర యంత్రాంగం కూడా అలాగే వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. తెలుగు దేశం పార్టీ బాధితుల్ని ఆదుకుంటుందని చంద్రబాబు తెలిపారు.మరోవైపు వరదలు రావడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇటు వైపు కన్నెత్తి చూడక పోవడం దురదృష్టకరం అంటున్నారు కూనవరం మండలం కాచవరం గ్రామ వరద బాధితులు.
ఇటు కోనసీమ జిల్లాల్లో ఇళ్లలోకి చేరిన వరద నీటిని తోడుకుంటూ అక్కడే ఉంటున్నారు లంక వాసులు. తమ వ్యక్తిగత ఇబ్బందులతో మహిళలు అవస్థలు అన్నీ ఇన్నీకావు. కాలనీ చుట్టూ నీరు, ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇంటి బయట కాలు పెట్టలేని స్థితిలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు జనాలు. జ్వరాలతో బాధ పడుతున్నారు చిన్నారులు. వరద ఉధృతి మరింత పెరిగితే ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
Bundelkhand Expressway: బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!