Chandrababu Naidu: 21, 22 తేదీల్లో వరదప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో భారీవర్షాలు, గోదావరి వరదలతో ఏపీలో పరిస్థితి దయనీయంగా మారింది. వరదలతో లంక గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) . ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు ఏర్పాట్లు చేశారు. గాల్లో తిరిగితే సీఎం జగనుకు ప్రజల వరద కష్టాలు ఏం తెలుస్తాయి. పీకల్లోతు వరదల్లో ప్రజలు మునిగి ఉంటే కాలికి బురద అంటకుండా హెలికాప్టరులో సీఎం జగన్ తిరుగుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు.
Railway Police Save Life: ప్రాణాలు పోయేవి.. వ్యక్తిని కాపాడిన రైల్వే పోలీసులు
Also Read
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
వరదపై ప్రభుత్వ సన్నద్ధత అసలేం లేదు.. బాధితులకు సాయమూ లేదు..! నాలుగు రోజుల పాటు ప్రజలకు భోజనం, నీళ్లు ఇవ్వలేరా? పోలవరం కాఫర్ డ్యాం ఎత్తుపై ఇప్పుడు కొత్త డ్రామాలు.. మూడేళ్లు ఏం చేశారు..? వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని బాబు పిలుపునిచ్చారు. విపత్తుల సమయంలో ఆయా ప్రాంతాల్లో మంత్రులు గాని, ఇతర ప్రభుత్వ పెద్దలు గాని నిరంతరం పర్యవేక్షించే పరిస్థితి ఉండాలి. అయితే ఈ ప్రభుత్వంలో అదేమీ లేదు. జగన్ వరదలపై నాన్ సీరియస్ గా ఉండడం వల్లే కెబినెట్, ఇతర యంత్రాంగం కూడా అలాగే వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. తెలుగు దేశం పార్టీ బాధితుల్ని ఆదుకుంటుందని చంద్రబాబు తెలిపారు.మరోవైపు వరదలు రావడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇటు వైపు కన్నెత్తి చూడక పోవడం దురదృష్టకరం అంటున్నారు కూనవరం మండలం కాచవరం గ్రామ వరద బాధితులు.
ఇటు కోనసీమ జిల్లాల్లో ఇళ్లలోకి చేరిన వరద నీటిని తోడుకుంటూ అక్కడే ఉంటున్నారు లంక వాసులు. తమ వ్యక్తిగత ఇబ్బందులతో మహిళలు అవస్థలు అన్నీ ఇన్నీకావు. కాలనీ చుట్టూ నీరు, ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇంటి బయట కాలు పెట్టలేని స్థితిలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు జనాలు. జ్వరాలతో బాధ పడుతున్నారు చిన్నారులు. వరద ఉధృతి మరింత పెరిగితే ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
Bundelkhand Expressway: బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ
తాజావార్తలు
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?