రాష్ట్ర విభజనపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ప్రధావి మోడీవి పనికిమాలిన కూతలుగా పేర్కొన్న ఆయన.. దేశానికి ప్రధానిగా ఇలా మాట్లాడతారా ? అని నిలదీశారు… తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోడీ ఎనిమిదేళ్ళ క్రితం అన్నారని గుర్తుచేసిన కేటీఆర్.. ఇప్పుడు మళ్లీ అసందర్భంగా మాట్లాడారని దుయ్యబట్టారు.. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సిందేన్నారు.. ఇక, విగ్రహావిష్కరణ కోసం…
మోడీ పార్లమెంట్లో అసభ్యకరంగా మాట్లాడాడని, పనికి మాలిన మాటలు చెప్పారని మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వాసం కల్పించాల్సిన వారు విద్వేషాలు రెచ్చగొట్టారని, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి మాటలు మాట్లాడిన ప్రధాని లేరని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా చేవెళ్ల ప్రాణహిత కోసం జాతీయ హోదా ఇవ్వలేదని, రైతు చట్టాలను పోరాటాలు ద్వారా వెనక్కి తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్ కంటే తెలంగాణ అభివృద్ధి…
ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు వార్ నడుస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ దుమారం రేపుతుండగా దానికి కౌంటర్గా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ ట్వీట్పై ఉదయం కిషన్రెడ్డి ట్విట్టర్లో.. ఎంఐఎంతో ఎవరు చేతులు కలిపినా వాళ్ల వ్యాఖ్యల్ని సమర్థించినట్టేనన్నారు. సబ్ కా సాథ్, సబ్కా వికాస్ లక్ష్యంగా వెళ్తున్న మోడీని విమర్శిస్తురా..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ట్విట్టర్లోనే కిషన్రెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మోదీ ఆధ్యాత్మిక పురుషుడు.కేసీఆర్ చాలా తప్పులు మాట్లాడారన్నారు. ఆయన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆయన కొడుకుని, కూతుర్ని దింపేయమనండి రాజ్యాంగం మారిపోద్ది. ఫ్యామిలీ పార్టీలకు చెక్ పెట్టేందుకు రాజ్యాంగం రాసుకుంటూ పోతున్నాం అన్నారు. ఫ్యామిలీ పార్టీ లను భారతదేశంలో ఉంచం. ఆంధ్ర రాష్టంలో మేము, మా మిత్రపక్షం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక చేస్తున్నాం. రెండు యూనిట్ ల…
సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేసీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు తెలంగాణ మంత్రి కేటీఆర్… సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారంగా తెలిపిన ఆయన.. సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయం అని హెచ్చరించారు.. సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందన్న ఆయన.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేళ్ల కాలంలో అద్భుతంగా అభివృద్ధి ప్రస్థానంలో ముందుకు పోతుంది.. ఇలాంటి సంస్థను ఉద్దేశ్యపూర్వకంగా చంపే కుట్రకు కేంద్రం తెరలేపిందని…
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు సతీసమేతంగా దర్శించుకున్నారు. రఘునందన్ రావు దంపతులకు ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాన్నిఆలయ అర్చకులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటిఆర్ నువ్వు సిరిసిల్ల, వేములవాడ రెండు కళ్ళు అన్నావ్, సిరిసిల్ల కి ఎన్ని నిధులు పోయాయి..వేములవాడ కి ఎన్ని నిధులు ఇచ్చారని ఆయన అన్నారు. అంతేకాకుండా వేములవాడ…
వచ్చే 18 నెలల్లో కరీంనగర్, వరంగల్, ఖమ్మం మరియు హైదరాబాద్ మధ్య మరో 1,400 మంది ఉద్యోగులను చేర్చుకునే ప్రణాళికను హెల్త్ టెక్నాలజీ సేవల సంస్థ ఎక్లాట్ హెల్త్ ప్రకటించింది. వాషింగ్టన్ DCలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న సంస్థ, తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ డెలివరీ కేంద్రాలను కలిగి ఉంది. దీనికి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ గల్ఫ్ క్యాపిటల్ మద్దతు ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఎక్లాట్ ఇప్పటికే 200 మంది ఉద్యోగులను కలిగి ఉన్న…
కేంద్ర బడ్జెట్పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఎనిమిదో బడ్జెట్లో కూడా తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు.. ఒకవైపు పవర్లూం, చేనేత కార్మికులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది.. కానీ, కేంద్రం ప్రభుత్వం ఏడున్నార సంవత్సరాలుగా అండగా నిలబడండని కోరుతున్నా పట్టించుకోవడంలేదన్నారు.. సిరిసిల్లకు మెగా పవర్ రూమ్ క్లస్టర్ ఇవ్వండి అని అడిగినా మొండిచేయి చూపిస్తున్నారన్న ఆయన.. పవర్లూం క్లస్టర్ లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్…
ఎన్టీఆర్ గార్డెన్స్లో త్వరలో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్లోని ఇందిరానగర్ డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. “హైదరాబాద్లో, ఒకవైపు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన 2BHK హౌసింగ్ సైట్లలో ఇదొకటి, కొత్త సెక్రటేరియట్ను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం త్వరలో రానుంది.” అని కేటీఆర్ వెల్లడించారు. ఖైరతాబాద్ వార్డులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్…
సిరిసిల్ల జిల్లా సుద్దాల కి చెందిన ప్రకృతి ప్రేమికుడు ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ. తన పుట్టిన రోజు నాడు పర్యావరణ హిత కార్యక్రమం చేయాలని తలచింది. పచ్చదనాన్ని ప్రేమించే తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసింది. తాను తయారు చేసిన సీడ్ బాల్స్ కొన్ని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీయార్, ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.…