Bandi Sanjay: కేంద్ర నిధులతో ప్రారంభోత్సవాలు.. సిగ్గులేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులతో కరీంనగర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా మళ్లీ కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్ లో నిన్న ప్రారంభోత్సవం చేసిన నిధులు ఎక్కడి నుండి వచ్చాయో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిన్న టీఆర్ఎస్ నాయకులు సభలో ఏది మాట్లాడినా నడుస్తుందనుకుని సిగ్గులేకుండా వ్యవహరించారు. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి ‘ప్రసాదం’ స్కీం కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ప్రతిపాదనలు పంపలేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా స్పందన లేదు.
Also Read
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
నేను ఏమీ చేయలేదని టీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలు చెబుతూ డ్రమ్ములో రాళ్లేసి సౌండ్ చేసినట్లు ఒర్లుతున్నారు. అయినా ఆ కుటుంబమే (కేసీఆర్) అటువంటిది. ఏది పడితే అది మొరగడం వాళ్లకు అలవాటైంది. అసలు తెలంగాణకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా కేంద్రంపై ఏడ్వటం సిగ్గు చేటు. మతపిచ్చి లేపుతున్నానని చెబుతున్న వాళ్లకు… నేను సగర్వంగా హిందువనని చెప్పకుంటానన్నారు. హిందువులు రెచ్చగొడితే రెచ్చిపోయేటోళ్లు కాదు. ఎంఐఎం కోసం మైనారిటీ సంతుష్ట విధానాలను అవలంభించే మీలాంటోళ్లకు బుద్ది చెబుతాం.
ఎంపీగా అడ్డిమార్ గుడ్డిసూట్ లో గెలిచారనే ఆరోపణలు చేస్తున్న వాళ్లు నన్ను కరీంనగర్ ప్రజలు లక్ష ఓట్లతో గెలిపించిన సంగతి గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ గెలిచేందుకు వంద కోట్లు ఖర్చు పెట్టినా ఆ పార్టీ అభ్యర్ధిని ఓడించిండ్రు. అందరూ కలిసినా బీజేపీని ఏమీ చేయలేకపోయిండ్రు. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని గెలిచేది మీరే. నీ అయ్యతోసహా మీరంతా తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని గెలిచిండ్రు. కానీ నీ అయ్య తెలంగాణ బిల్లు ఓటింగ్ లో పాల్గొనలేదు. సీఎం అయ్యాక నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం చేసిండు. ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటుండు. డీపీఆర్ పంపకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎట్లా ఇస్తారు? ఏది పడితే అది మొరిగితే.. జనం వాత పెడతారని టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు బండి సంజయ్. గంగులపై పోటీ చేయాలంటూ తూట్ పాలిష్ గాళ్లు చెప్పే మాటలను పట్టించుకునేదెవరు?
టీఆర్ఎస్ కు భయం పట్టుకుంది. హిందుత్వం, బీజేపీ, కాషాయం అంటేనే వణుకు మొదలైంది. అందుకే టీఆర్ఎస్ సభను అడ్డుకుంటామనే భయంతో బీజేపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసిండ్రు సిగ్గు లేకుండా… అడ్డుకోవాలనే నీచ సంస్కృతి మాత్రం మాకు లేదు. బీజేపీ అంటే భయంతోనే వాళ్లు అరెస్టు చేస్తుండ్రు. టీఆర్ఎస్ లెక్క బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ కాదు. జాతీయ పార్టీ. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎవరైనా సరే దానికి కట్టుబడి ఉండాల్సిందే. దాని ప్రకారమే బండి సంజయ్ అయినా.. ఇంకెవరైనా పోటీ చేయాల్సిందే.. పనిచేయాల్సిందే అన్నారు బండి సంజయ్.
తాజావార్తలు
-
Paytm Pocket Money Feature: పేటీఎం ‘పాకెట్ మనీ’ ఫీచర్.. బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. పిల్లలకు డిజిటల్ పేమెంట్స్ సులభం
-
Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!