తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీబచేసిన ట్వీట్ పై టీఆర్ఎస్ నేతలు పోటీ పడి కామెంట్స్ చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటారని భావించాం. కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ గురించి, ఈ దేశం గురించి కేటీఆర్ కు అవగాహన లేదు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తున్నా, నిజమో కాదో, తండ్రి కేసీఆర్ ను అడిగి కేటీఆర్ తెలుసుకోవాలి.
కేటీఆర్ కు గాంధీ కుటుంబానికి పోలిక ఉందా? బాయిల్డ్ రైస్ ఫుడ్ కార్పోరేషన్ కి సరఫరా చెయ్యమని సంతకం పెట్టింది కేసీఆర్. రైతులకు బియ్యంతో సంబంధం లేదు. తెలంగాణ రైతుల పంటను కొనాల్సిన నైతిక బాధ్యత రాష్ట్ర సర్కారుదే. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపెట్టేందుకు , రైతులను ఫణంగా పెడుతున్నారు. రైతుల పట్ల కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే, జంతర్ మంతర్ లో ఆమరణ దీక్ష చెయ్యాలి.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తాం. తెలంగాణ లో జరిగే కాంగ్రెస్ ప్రజా ఉద్యమాల్లో రాహుల్ గాంధీ , ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడారు.