కవల పిల్లల్లో పోలికలు ఒకే తీరుగా ఉంటాయి. తల్లిదండ్రులు తప్పా మిగతా వారు గుర్తు పట్టలేకపోతుంటారు. ట్విన్స్ పోలికల్లోనే కాదు దాదాపు టాలెంట్ లో కూడా ఒకేలా ఉంటుంటారు. ఇలాగే ఓ ఇద్దరు ట్విన్ బ్రదర్స్ జేఈఈ మెయిన్స్ లో అద్భుతమైన ప్రతిభకనబర్చారు. కవల సోదరులు కవల మార్కులు సాధించారు. ఏకంగా 100 పర్సంటైల్ తో అదరగొట్టారు. ఈ సంవత్సరం, IITలు సహా దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఇంజనీరింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష అయిన JEE మెయిన్…
Building Collapse: రాజస్థాన్లోని కోటా నగరంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోవడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సుమారు 8:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు, దీనితో ఐదుగురిని శిథిలాల నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.…
Vande Bharat : దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ను మూడో రోజు విజయవంతంగా పరీక్షించారు. ఇది రాజస్థాన్లోని కోటా - లాబాన్ మధ్య 30 కి.మీల విస్తీర్ణంలో గంటకు 180 కి.మీ వేగంతో నడిచింది.
రాజస్థాన్లో ఓ పెద్ద నాగుపాము వాషింగ్ మిషన్లోకి దూరింది. లోపలికి దూరి హాయ్గా విశ్రాంతి తీసుకుంటుంది. సడన్గా కుటుంబ సభ్యుడు.. వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేసి చూడగా పాము ప్రత్యక్షమైంది. దీంతో అతడు షాక్కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోటాలో మరో ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. బీహార్లోని భాగల్పూర్కు చెందిన హర్షిత్ అగర్వాల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నీట్కు సిద్ధమవుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీలో ఉంచారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి గదిలో నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఏడాది కోటాలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.…
నీట్-యూజీ 2024 ఫలితాల వల్ల కోటాలో ఆత్మహత్యలు జరగలేదని, పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ పిటిషనర్లు భావోద్వేగ వాదనలు చేయవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. కోటాలో కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరు చేసిన ఆరోపణలపై న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Kota Factory Season 3 comes to Netflix on June 20: ఓటీటీలలో కొన్ని వెబ్ సిరీస్లకు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఒక సీజన్ పూర్తయ్యాక.. మరో సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి వెబ్ సిరీస్లలో ‘కోటా ఫ్యాక్టరీ’ ఒకటి. ఈ సిరీస్ నుంచి రెండు సీజన్లు విడుదల కాగా.. భారీ హిట్ సాధించాయి. దాంతో సీజన్ 3 ఎప్పుడు వస్తుందా? అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెట్ఫ్లిక్స్ శుభవార్త…
Rajasthan: రాజస్థాన్లోని కోటాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న బైక్పై రొమాన్స్ చేస్తున్న జంటను కోట పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
RAJASTHAN: తల్లిదండ్రుల నిర్లక్ష్యం మూడేళ్ల పాప ప్రాణాలను తీసింది. పెళ్లి వేడకకు వెళ్లిన దంపతులు తమ పిల్లలు కార్ దిగారా..? లేదా.? అని చూసుకోకపోవడంతో పాప కారులోనే చిక్కుకుని మరణించింది.
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు, మిస్సింగ్స్ ఆగడం లేదు. చదువుల్లో ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా.. తాజాగా మరో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఆ విద్యార్థి.. ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నానంటూ పేరెంట్స్కు మెసేజ్ చేసి అదృశ్యమయ్యాడు. దీంతో పోలీసులు విద్యార్థి జాడ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు.