Student Suicide: కోటాలో నీట్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థి ఆత్మహత్య..
- కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
- బీహార్లోని భాగల్పూర్కు చెందిన హర్షిత్ అగర్వాల్
- నీట్కు సిద్ధమవుతున్న విద్యార్థి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోటాలో మరో ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. బీహార్లోని భాగల్పూర్కు చెందిన హర్షిత్ అగర్వాల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నీట్కు సిద్ధమవుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీలో ఉంచారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి గదిలో నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఏడాది కోటాలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కోటాలో ఉంటూ నీట్ (యూజీ)కి సిద్ధమవుతున్నాడు. మృతదేహం పరిస్థితిని పరిశీలించగా.. మృతదేహానికి రెండు మూడు రోజుల నాటిదని తేలింది. ప్రస్తుతం విద్యార్థి గదిలో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, ఆత్మహత్యకు గల కారణాలపై సమాచారం లేదని పోలీసులు తెలిపారు.
Read Also: Toxic: టాక్సిక్ చిత్రంలో బాలీవుడ్ నటి.. ఎవరంటే?
Also Read
- Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
- IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
మొదటగా విద్యార్థి గది నుంచి దుర్వాసన వస్తోందని.. చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం అందించారని ఏఎస్సై శంభుదయాళ్ తెలిపారు. విద్యార్థి గది చుట్టూ ఇతర విద్యార్థుల గదులు ఉన్నాయని.. అందులోనూ విద్యార్థులు ఉంటున్నారని చెప్పారు. కొన్ని రోజులుగా విద్యార్థి తన గది నుంచి బయటకు రావడం లేదని వారు చెప్పారన్నారు. ప్రస్తుతం విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై ఎలాంటి సమాచారం అందలేదు. విద్యార్థి కుటుంబసభ్యులు కోటకు చేరుకున్న తర్వాతే ఘటనకు సంబంధించిన సమాచారం అందుతుందని పోలీసులు చెబుతున్నారు.
Read Also: Ponguleti: గత ప్రభుత్వం పద్మశ్రీ రామచంద్రయ్యకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి..
కోటాలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విద్యార్థుల్లో ఒక బీటెక్ విద్యార్థి కూడా ఉన్నాడు. విద్యార్థుల ఆత్మహత్యలకు చదువు విషయంలో మానసిక ఒత్తిడే కారణమని తేలింది. మెడికల్, ఇంజినీరింగ్ రంగాల్లో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు వచ్చిన విద్యార్థులు కోటాలో తమ జీవితాలను ముగించుకుంటున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతేడాది 2023లో కోటాలో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
- Tags
- kota
- NEET
- student
- suicide
- telugu news
తాజావార్తలు
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!