Student Suicide: కోటాలో నీట్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థి ఆత్మహత్య..
- కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
- బీహార్లోని భాగల్పూర్కు చెందిన హర్షిత్ అగర్వాల్
- నీట్కు సిద్ధమవుతున్న విద్యార్థి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోటాలో మరో ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. బీహార్లోని భాగల్పూర్కు చెందిన హర్షిత్ అగర్వాల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నీట్కు సిద్ధమవుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీలో ఉంచారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి గదిలో నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఏడాది కోటాలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కోటాలో ఉంటూ నీట్ (యూజీ)కి సిద్ధమవుతున్నాడు. మృతదేహం పరిస్థితిని పరిశీలించగా.. మృతదేహానికి రెండు మూడు రోజుల నాటిదని తేలింది. ప్రస్తుతం విద్యార్థి గదిలో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, ఆత్మహత్యకు గల కారణాలపై సమాచారం లేదని పోలీసులు తెలిపారు.
Read Also: Toxic: టాక్సిక్ చిత్రంలో బాలీవుడ్ నటి.. ఎవరంటే?
Also Read
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
మొదటగా విద్యార్థి గది నుంచి దుర్వాసన వస్తోందని.. చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం అందించారని ఏఎస్సై శంభుదయాళ్ తెలిపారు. విద్యార్థి గది చుట్టూ ఇతర విద్యార్థుల గదులు ఉన్నాయని.. అందులోనూ విద్యార్థులు ఉంటున్నారని చెప్పారు. కొన్ని రోజులుగా విద్యార్థి తన గది నుంచి బయటకు రావడం లేదని వారు చెప్పారన్నారు. ప్రస్తుతం విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై ఎలాంటి సమాచారం అందలేదు. విద్యార్థి కుటుంబసభ్యులు కోటకు చేరుకున్న తర్వాతే ఘటనకు సంబంధించిన సమాచారం అందుతుందని పోలీసులు చెబుతున్నారు.
Read Also: Ponguleti: గత ప్రభుత్వం పద్మశ్రీ రామచంద్రయ్యకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి..
కోటాలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విద్యార్థుల్లో ఒక బీటెక్ విద్యార్థి కూడా ఉన్నాడు. విద్యార్థుల ఆత్మహత్యలకు చదువు విషయంలో మానసిక ఒత్తిడే కారణమని తేలింది. మెడికల్, ఇంజినీరింగ్ రంగాల్లో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు వచ్చిన విద్యార్థులు కోటాలో తమ జీవితాలను ముగించుకుంటున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతేడాది 2023లో కోటాలో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
- Tags
- kota
- NEET
- student
- suicide
- telugu news
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!