Student Suicide: కోటాలో నీట్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థి ఆత్మహత్య..
- కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
- బీహార్లోని భాగల్పూర్కు చెందిన హర్షిత్ అగర్వాల్
- నీట్కు సిద్ధమవుతున్న విద్యార్థి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోటాలో మరో ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. బీహార్లోని భాగల్పూర్కు చెందిన హర్షిత్ అగర్వాల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నీట్కు సిద్ధమవుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీలో ఉంచారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి గదిలో నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఏడాది కోటాలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కోటాలో ఉంటూ నీట్ (యూజీ)కి సిద్ధమవుతున్నాడు. మృతదేహం పరిస్థితిని పరిశీలించగా.. మృతదేహానికి రెండు మూడు రోజుల నాటిదని తేలింది. ప్రస్తుతం విద్యార్థి గదిలో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, ఆత్మహత్యకు గల కారణాలపై సమాచారం లేదని పోలీసులు తెలిపారు.
Read Also: Toxic: టాక్సిక్ చిత్రంలో బాలీవుడ్ నటి.. ఎవరంటే?
Also Read
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- Amit Shah-Om Birla: లోక్సభ స్పీకర్కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
మొదటగా విద్యార్థి గది నుంచి దుర్వాసన వస్తోందని.. చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం అందించారని ఏఎస్సై శంభుదయాళ్ తెలిపారు. విద్యార్థి గది చుట్టూ ఇతర విద్యార్థుల గదులు ఉన్నాయని.. అందులోనూ విద్యార్థులు ఉంటున్నారని చెప్పారు. కొన్ని రోజులుగా విద్యార్థి తన గది నుంచి బయటకు రావడం లేదని వారు చెప్పారన్నారు. ప్రస్తుతం విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై ఎలాంటి సమాచారం అందలేదు. విద్యార్థి కుటుంబసభ్యులు కోటకు చేరుకున్న తర్వాతే ఘటనకు సంబంధించిన సమాచారం అందుతుందని పోలీసులు చెబుతున్నారు.
Read Also: Ponguleti: గత ప్రభుత్వం పద్మశ్రీ రామచంద్రయ్యకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి..
కోటాలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విద్యార్థుల్లో ఒక బీటెక్ విద్యార్థి కూడా ఉన్నాడు. విద్యార్థుల ఆత్మహత్యలకు చదువు విషయంలో మానసిక ఒత్తిడే కారణమని తేలింది. మెడికల్, ఇంజినీరింగ్ రంగాల్లో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు వచ్చిన విద్యార్థులు కోటాలో తమ జీవితాలను ముగించుకుంటున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతేడాది 2023లో కోటాలో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
- Tags
- kota
- NEET
- student
- suicide
- telugu news
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..