Kota: కోటాలో ఓ విద్యార్థి మిస్సింగ్.. ఐదేళ్లపాటు ఇంటికి దూరంగా వెళ్తున్నట్లు మెస్సెజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు, మిస్సింగ్స్ ఆగడం లేదు. చదువుల్లో ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా.. తాజాగా మరో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఆ విద్యార్థి.. ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నానంటూ పేరెంట్స్కు మెసేజ్ చేసి అదృశ్యమయ్యాడు. దీంతో పోలీసులు విద్యార్థి జాడ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు.
కోటా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థి గంగారాంపూర్లోని బమన్శాస్కు చెందిన రాజేంద్ర మీనా (19)గా గుర్తించారు. కోటాలో మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ కోచింగ్ క్లాస్లకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన విద్యార్థి మిస్సింగ్ అయ్యాడు. కాగా.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తాను ఉండే పీజీని ఖాళీ చేసి వెళ్లిపోయాడు.
Also Read
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
Mega Brothers: తెలుగు రాష్ట్రాలను ఊపు ఊపుతున్న జనసేనాని చిన్నప్పడు ఎలా ఉండెవడో చుసారా.. ఫోటో వైరల్..
విద్యార్థి రాజేంద్ర వెళ్లిపోయేముందు.. తన తండ్రి జగదీశ్ మీనాకు ఓ మెసేజ్ పంపించాడు. “నేను ఐదేళ్ల పాటు ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోతున్నాను. నాకు చదువుకోవాలని లేదు. ఇప్పుడు నా వద్ద రూ. 8 వేలు ఉన్నాయి. ఫోన్ కూడా అమ్మేస్తున్నాను. నా వద్ద ఉన్న సిమ్ను కూడా తీసేస్తున్నా. అమ్మకు చెప్పండి నా గురించి బాధపడొద్దని. నేను ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడను. అందరి నంబర్లూ నా దగ్గర ఉన్నాయి. అవసరమైతే తప్పకుండా కాల్ చేస్తా. ఏడాదికి ఓసారి కచ్చితంగా ఫోన్ చేస్తా” అని తన తండ్రి జగదీశ్ మీనాకు మెస్సెజ్ పెట్టాడు.
ఈ సందేశం చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కాగా.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జగదీశ్ మీనా ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విద్యార్థి కోసం వెతకడం ప్రారంభించారు. కాగా, చదువులో ఒత్తిడి కారణంగానే విద్యార్థి ఇలా అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!