Kota: కోటాలో ఓ విద్యార్థి మిస్సింగ్.. ఐదేళ్లపాటు ఇంటికి దూరంగా వెళ్తున్నట్లు మెస్సెజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు, మిస్సింగ్స్ ఆగడం లేదు. చదువుల్లో ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా.. తాజాగా మరో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఆ విద్యార్థి.. ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నానంటూ పేరెంట్స్కు మెసేజ్ చేసి అదృశ్యమయ్యాడు. దీంతో పోలీసులు విద్యార్థి జాడ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు.
కోటా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థి గంగారాంపూర్లోని బమన్శాస్కు చెందిన రాజేంద్ర మీనా (19)గా గుర్తించారు. కోటాలో మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ కోచింగ్ క్లాస్లకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన విద్యార్థి మిస్సింగ్ అయ్యాడు. కాగా.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తాను ఉండే పీజీని ఖాళీ చేసి వెళ్లిపోయాడు.
Also Read
Mega Brothers: తెలుగు రాష్ట్రాలను ఊపు ఊపుతున్న జనసేనాని చిన్నప్పడు ఎలా ఉండెవడో చుసారా.. ఫోటో వైరల్..
విద్యార్థి రాజేంద్ర వెళ్లిపోయేముందు.. తన తండ్రి జగదీశ్ మీనాకు ఓ మెసేజ్ పంపించాడు. “నేను ఐదేళ్ల పాటు ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోతున్నాను. నాకు చదువుకోవాలని లేదు. ఇప్పుడు నా వద్ద రూ. 8 వేలు ఉన్నాయి. ఫోన్ కూడా అమ్మేస్తున్నాను. నా వద్ద ఉన్న సిమ్ను కూడా తీసేస్తున్నా. అమ్మకు చెప్పండి నా గురించి బాధపడొద్దని. నేను ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడను. అందరి నంబర్లూ నా దగ్గర ఉన్నాయి. అవసరమైతే తప్పకుండా కాల్ చేస్తా. ఏడాదికి ఓసారి కచ్చితంగా ఫోన్ చేస్తా” అని తన తండ్రి జగదీశ్ మీనాకు మెస్సెజ్ పెట్టాడు.
ఈ సందేశం చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కాగా.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జగదీశ్ మీనా ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విద్యార్థి కోసం వెతకడం ప్రారంభించారు. కాగా, చదువులో ఒత్తిడి కారణంగానే విద్యార్థి ఇలా అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!