Supreme Court: కోటా ఆత్మహత్యలకు సంబంధం లేదు.. నీట్ పిటిషన్లపై చురకలు
- నీట్-యూజీ 2024 ఫలితాల వల్ల కోటాలో ఆత్మహత్యలు జరగలేదు- సుప్రీంకోర్టు
- పిటిషనర్లు భావోద్వేగ వాదనలు చేయవద్దని సూచించిన న్యాయస్థానం
- నీట్ పరీక్షలో పేపర్ లీక్.. ఇతర అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని పిటిషన్
- ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు
- తదుపరి విచారణ తేదీ జూలై 8కి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్-యూజీ 2024 ఫలితాల వల్ల కోటాలో ఆత్మహత్యలు జరగలేదని, పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ పిటిషనర్లు భావోద్వేగ వాదనలు చేయవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. కోటాలో కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరు చేసిన ఆరోపణలపై న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Ayodhya: “అయోధ్య రామాలయాన్ని కూల్చేస్తాం”..జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరింపు
Also Read
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
కోటాలో ఆత్మహత్యలు నీట్-యూజీ 2024 ఫలితాల వల్ల జరగలేదని వ్యాఖ్యానించిన జస్టిస్ నాథ్, “ఇక్కడ అనవసరమైన భావోద్వేగ వాదనలు చేయవద్దు” అని సూచించారు. ఆ తర్వాత సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ప్రతిస్పందన దాఖలు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ)ని ఆదేశించగా, ఇతర ప్రతివాదులు (కేంద్రం) తదుపరి విచారణ తేదీ జూలై 8కి వాయిదా వేసింది. నీట్ పరీక్షకు సంబంధించి దాఖలైన ఇతర పెండింగ్ పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని స్పష్టం చేసింది. బిహార్లో నీట్ ప్రశ్నాపత్నం లీకైనట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
Stock market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ తాజా రికార్డ్ ఇదే
ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)- యూజీ 2024పై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నీట్ పరీక్షలో పేపర్ లీక్, ఇతర అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్ అభ్యర్థించారు. దీంతో ఈరోజు విచారణ చేపట్టారు. కాగా.. ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు మొదటి ర్యాంక్ రావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో.. 1563 మంది విద్యార్థుల గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లు గురువారం కేంద్రం, సుప్రీంకోర్టు తెలిపింది.
తాజావార్తలు
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!