DK Shivakumar: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్ ను పైలెట్ చాకచక్యంగా సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదం నుంచి డీకే శివకుమార్ తప్పించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో పాటు కర్ణాటకకు చెందిన ఓ న్యూస్ రిపోర్టర్ కూడా హెలికాప్టర్ లో ఉన్నారు.
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, రాష్ట్రశాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటిల్ ఇందులో పాల్గొననున్నారు.
Jairam Ramesh: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని నరేంద్రమోడీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది, కానీ కాంగ్రెస్ మాత్రం స్థానికతకు పెద్ద పీట వేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ అన్నారు. నాలుగు ఏళ్ల బీజేపీ పాలన తర్వాత కర్ణాటక ప్రజలకు విటమిన్-పి కావాలని ఆయన అన్నారు.
PM Modi: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు శక్తివంచన లేకుండా అధికారం కోసం ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ పెద్ద ఎత్తున ప్రచారకార్యక్రమాలను ప్రారంభించారు. ఆదివారం కోలార్ ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. కోలార్ లో జరిగిన సభ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు నిద్రపట్టకుండా చేస్తుందని అన్నారు. ఈ రెండు పార్టీలు కర్ణాటక అభివృద్ధికి అవరోధంగా తయారయ్యాయన్నారు. ప్రజలు వాటిని క్లీన్ బౌల్డ్ చేశారని, కాంగ్రెస్, జేడీఎస్ అవినీతి…
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్స్ స్టేజ్ కి చేరకుంటున్నాయి. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్నాటకలో మరోసారి కమలం తినిపించేలా బీజేపీ జోరుగా ప్రచారం ప్రారంభించింది.
కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కన్నడ సినీ స్టార్ శివరాజ్కుమార్ సతీమణి గీతా శివ రాజ్కుమార్ జేడీఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గీతా శివరాజ్ కుమార్ కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రకటించడంపై ఘాటుగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.
Yogi Adityanath: కర్ణాటక ఎన్నికలకు మరో కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్టార్ క్యాంపెనర్లను ప్రచారంలోకి దించాయి. తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాండ్యాలో ఆయన ఎన్నికల ర్యాలీలో బుధవారం పాల్గొన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు.. మే 9వ తేదీ వరకు ముస్లింలకు రిజర్వేషన్లను రద్దు చేసే ప్రక్రియలో కర్ణాటక ప్రభుత్వ ప్రమేయం ఉండకూడదని ఆదేశించింది.
హిజాబ్ ధరించడం కోసం అల్లరి మూకలతో ధైర్యంగా పోరాడి సోషల్ మీడియాతో పాటు అన్ని చోట్లా వైరల్ అయిన ఓ విద్యార్థిని ఇప్పుడు ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో సత్తా చాటింది. ఏకంగా టాపర్ గా నిలవడంతో పాటు చదువు కోసం తాను చేసిన పోరాటం వృథా కాలేదని నిరూపించింది. కర్ణాటకలో క్లాస్ 12 ఫలితాల్ని తాజాగా బోర్డు ప్రకటించింది. ఇందులో 600 మార్కులకు గానూ ఏకంగా 593 మార్కులు సాధించి సదరు హిజాబ్ బాలిక తబస్సుమ్ టాపర్…