Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ఓటింగ్ శాతంలో రికార్డ్..1952 తర్వాత ఇదే తొలిసారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లు తమ చైతన్యాన్ని చూపారు. 224 అసెంబ్లీ స్థానాలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో 73.19 శాతం ఓటింగ్ నమోదు అయింది. గతంలో 2018 ఎన్నికల నమోదైన 72.44 శాతంతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగా రికార్డ్ అయింది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు వచ్చినా.. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని, కొన్ని సర్వేలు మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తాయని వెల్లడించాయి.
అయితే ఎప్పుడూ లేని విధంగా కన్నడ ఓటర్లు రికార్డ్ క్రియేట్ చేశారు. రికార్డ్ ఓటింగ్ శాతం నమోదు అయింది. 1952 తర్వాత ఇప్పుడే తొలిసారిగా పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అయింది. మొత్తం 5,30,85,566 ఓటర్లలో 3,88,51,807 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 73.68 శాతం కాగా.. మహిళలు 72.70 శాతం, ఇతరులు 21.05 శాతం ఉన్నారు. ఒవరాల్ గా 73.19 శాతం పోలింగ్ నమోదు అయింది.
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
Read Also: Bandi Sanjay : కేంద్రం డబ్బులు వాడుకొని తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు
చిక్కబళ్లాపూర్ జిల్లాలో అత్యధికంగా 85.83 శాతం, రామనగరంలో 84.98 శాతం పోలింగ్ నమోదైంది. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కర్ణాటకలో 72.44 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ సమయంలో బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. గత 38 ఏళ్లుగా వరసగా ఏ పార్టీకి కూడా వరసగా రెండో సారి అధికారాన్ని కట్టబెట్టలేదు కన్నడ ప్రజలు. అయితే ఈ సారి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చూడాలి.
ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగా పోరు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ కన్నడనాట విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఒకవేళ ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే మరోసారి జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ పాత్రను పోషించే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ‘భజరంగ్ ధళ్’ బ్యాన్ చేస్తామని ప్రకటించడం బీజేపీకి ఆయుధంగా మారింది. చివరి రోజుల్లో భజరంగబలి నినాదాలతో ప్రచారం మారుమోగింది. ప్రధానిని ‘విషసర్పం’గా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభివర్ణించడం కూడా వివాదాస్పదం అయింది. దీనికి ప్రతిగా బీజేపీ సోనియాగాంధీని ‘విష కన్య’తో పోల్చారు.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!