Ind vs Eng : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. ఫైనల్లోకి టీమిండియా..
- టీ20 వరల్డ్ కప్ రెండో సెమీస్.. ఫైనల్కు చేరిన టీమిండియా
- 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై భారత్ విజయం
- స్కోర్లు: భారత్-253/7.. ఇంగ్లండ్-246/7
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్లో సూర్యకుమార్ సేన 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్ (25), సాల్ట్ (5) త్వరగానే అవుట్ అయినప్పటికీ, యువ బ్యాటర్ జాకబ్ బెతెల్ (105) వీరోచిత సెంచరీతో భారత్ను వణికించాడు. కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ బాదిన బెథెల్, విల్ జాక్స్తో కలిసి 77 పరుగులు, శామ్ కరన్తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పి ఇంగ్లండ్ను విజయం అంచులకు తీసుకెళ్లాడు.
Also Read
- Best Batting Pair: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాదు.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్ జోడి ఇదే..
- Vaibhav Vs Jaiswal: వైభవ్ సూర్యవంశీ వల్లే జైస్వాల్ ఫ్లాప్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
- Hardik Pandya: MI వీడి చెన్నై సూపర్ కింగ్స్లోకి హార్దిక్ పాండ్యా.. 07:07 టైమ్పై సోషల్ మీడియాలో చర్చ..
- Venkatesh Iyer: సడన్గా వెంకటేశ్ అయ్యర్కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో కోహ్లీతో ఓపెనర్గా రంగంలోకి..
Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్లా నిగనిగలాడిపోతుంది.. టాన్కు చెక్ పెట్టే చిట్కా.!
కానీ.. మ్యాచ్ ఉత్కంఠగా మారుతున్న సమయంలో భారత ఫీల్డింగ్, ముఖ్యంగా అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. హ్యారీ బ్రూక్ ఇచ్చిన కష్టమైన క్యాచ్ను పరుగెత్తుకుంటూ వెనక్కి వెళ్లి అక్షర్ అందుకోవడం హైలైట్గా నిలిచింది. అలాగే విల్ జాక్స్ అవుట్ అయిన సమయంలో అక్షర్, దూబేలు కలిసి చేసిన రిలే క్యాచ్ స్టేడియంను హోరెత్తించింది.
చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 30 పరుగులు అవసరమవ్వగా, సూర్యకుమార్ యాదవ్ బంతిని శివమ్ దూబే చేతికి ఇచ్చాడు. మొదటి బంతికే ప్రమాదకరంగా మారిన బెతెల్ రనౌట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ వరుసగా మూడు సిక్సర్లు బాదినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ 246/7 పరుగులకు పరిమితమైంది.
హార్దిక్ పాండ్యా కీలక సమయంలో శామ్ కరన్ వికెట్ తీయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వేగాన్ని అడ్డుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా తన 4 ఓవర్లలో కేవలం 33 పరుగులు ఇచ్చి హ్యారీ బ్రూక్ వికెట్ తీసి ఇంగ్లండ్ను ఒత్తిడిలోకి నెట్టాడు. అర్ష్దీప్ సింగ్ భారీగా పరుగులు ఇచ్చుకున్నప్పటికీ విల్ జాక్స్ వికెట్ తీసి కీలక బ్రేక్ ఇచ్చాడు. అద్భుతమైన బ్యాటింగ్, చురుకైన ఫీల్డింగ్, సమయస్ఫూర్తితో కూడిన బౌలింగ్తో టీమిండియా ఫైనల్కు అర్హత సాధించింది. ఇప్పుడు అందరి కళ్లు న్యూజిలాండ్తో జరగబోయే గ్రాండ్ ఫైనల్పైనే ఉన్నాయి.
Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్తో నూబియా కొత్త ఫోన్.!
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?