Ind vs Eng : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. ఫైనల్లోకి టీమిండియా..
- టీ20 వరల్డ్ కప్ రెండో సెమీస్.. ఫైనల్కు చేరిన టీమిండియా
- 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై భారత్ విజయం
- స్కోర్లు: భారత్-253/7.. ఇంగ్లండ్-246/7
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్లో సూర్యకుమార్ సేన 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్ (25), సాల్ట్ (5) త్వరగానే అవుట్ అయినప్పటికీ, యువ బ్యాటర్ జాకబ్ బెతెల్ (105) వీరోచిత సెంచరీతో భారత్ను వణికించాడు. కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ బాదిన బెథెల్, విల్ జాక్స్తో కలిసి 77 పరుగులు, శామ్ కరన్తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పి ఇంగ్లండ్ను విజయం అంచులకు తీసుకెళ్లాడు.
Also Read
- Fatima Sana: భారత్తో మ్యాచ్లో అదే మా కొంపముంచింది.. ఏడ్చేసిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా!
- Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
- India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
- INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్లా నిగనిగలాడిపోతుంది.. టాన్కు చెక్ పెట్టే చిట్కా.!
కానీ.. మ్యాచ్ ఉత్కంఠగా మారుతున్న సమయంలో భారత ఫీల్డింగ్, ముఖ్యంగా అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. హ్యారీ బ్రూక్ ఇచ్చిన కష్టమైన క్యాచ్ను పరుగెత్తుకుంటూ వెనక్కి వెళ్లి అక్షర్ అందుకోవడం హైలైట్గా నిలిచింది. అలాగే విల్ జాక్స్ అవుట్ అయిన సమయంలో అక్షర్, దూబేలు కలిసి చేసిన రిలే క్యాచ్ స్టేడియంను హోరెత్తించింది.
చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 30 పరుగులు అవసరమవ్వగా, సూర్యకుమార్ యాదవ్ బంతిని శివమ్ దూబే చేతికి ఇచ్చాడు. మొదటి బంతికే ప్రమాదకరంగా మారిన బెతెల్ రనౌట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ వరుసగా మూడు సిక్సర్లు బాదినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ 246/7 పరుగులకు పరిమితమైంది.
హార్దిక్ పాండ్యా కీలక సమయంలో శామ్ కరన్ వికెట్ తీయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వేగాన్ని అడ్డుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా తన 4 ఓవర్లలో కేవలం 33 పరుగులు ఇచ్చి హ్యారీ బ్రూక్ వికెట్ తీసి ఇంగ్లండ్ను ఒత్తిడిలోకి నెట్టాడు. అర్ష్దీప్ సింగ్ భారీగా పరుగులు ఇచ్చుకున్నప్పటికీ విల్ జాక్స్ వికెట్ తీసి కీలక బ్రేక్ ఇచ్చాడు. అద్భుతమైన బ్యాటింగ్, చురుకైన ఫీల్డింగ్, సమయస్ఫూర్తితో కూడిన బౌలింగ్తో టీమిండియా ఫైనల్కు అర్హత సాధించింది. ఇప్పుడు అందరి కళ్లు న్యూజిలాండ్తో జరగబోయే గ్రాండ్ ఫైనల్పైనే ఉన్నాయి.
Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్తో నూబియా కొత్త ఫోన్.!
తాజావార్తలు
-
Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
-
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
-
TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
-
JNU: జేఎన్ యూ ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
-
Nandamuri Mokshagna : నేడు చిన్న సింబా బర్త్ డే.. ఎంట్రీ అప్డేట్ ఉంటుందా ?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!