Ind vs Eng : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. ఫైనల్లోకి టీమిండియా..
- టీ20 వరల్డ్ కప్ రెండో సెమీస్.. ఫైనల్కు చేరిన టీమిండియా
- 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై భారత్ విజయం
- స్కోర్లు: భారత్-253/7.. ఇంగ్లండ్-246/7
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్లో సూర్యకుమార్ సేన 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్ (25), సాల్ట్ (5) త్వరగానే అవుట్ అయినప్పటికీ, యువ బ్యాటర్ జాకబ్ బెతెల్ (105) వీరోచిత సెంచరీతో భారత్ను వణికించాడు. కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ బాదిన బెథెల్, విల్ జాక్స్తో కలిసి 77 పరుగులు, శామ్ కరన్తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పి ఇంగ్లండ్ను విజయం అంచులకు తీసుకెళ్లాడు.
Also Read
- Womens T20 World Cup: పాకిస్థాన్పై కొట్టడం అంటే ఆ మజానే వేరు.. ఫామ్లోకి వచ్చిన రిచా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్పైనే అందరి కళ్లు..!
- Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
- T20 World Cup: పాక్పై గెలిచినా తగ్గని కసి.. డచ్ జట్టుపై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..
Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్లా నిగనిగలాడిపోతుంది.. టాన్కు చెక్ పెట్టే చిట్కా.!
కానీ.. మ్యాచ్ ఉత్కంఠగా మారుతున్న సమయంలో భారత ఫీల్డింగ్, ముఖ్యంగా అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. హ్యారీ బ్రూక్ ఇచ్చిన కష్టమైన క్యాచ్ను పరుగెత్తుకుంటూ వెనక్కి వెళ్లి అక్షర్ అందుకోవడం హైలైట్గా నిలిచింది. అలాగే విల్ జాక్స్ అవుట్ అయిన సమయంలో అక్షర్, దూబేలు కలిసి చేసిన రిలే క్యాచ్ స్టేడియంను హోరెత్తించింది.
చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 30 పరుగులు అవసరమవ్వగా, సూర్యకుమార్ యాదవ్ బంతిని శివమ్ దూబే చేతికి ఇచ్చాడు. మొదటి బంతికే ప్రమాదకరంగా మారిన బెతెల్ రనౌట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ వరుసగా మూడు సిక్సర్లు బాదినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ 246/7 పరుగులకు పరిమితమైంది.
హార్దిక్ పాండ్యా కీలక సమయంలో శామ్ కరన్ వికెట్ తీయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వేగాన్ని అడ్డుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా తన 4 ఓవర్లలో కేవలం 33 పరుగులు ఇచ్చి హ్యారీ బ్రూక్ వికెట్ తీసి ఇంగ్లండ్ను ఒత్తిడిలోకి నెట్టాడు. అర్ష్దీప్ సింగ్ భారీగా పరుగులు ఇచ్చుకున్నప్పటికీ విల్ జాక్స్ వికెట్ తీసి కీలక బ్రేక్ ఇచ్చాడు. అద్భుతమైన బ్యాటింగ్, చురుకైన ఫీల్డింగ్, సమయస్ఫూర్తితో కూడిన బౌలింగ్తో టీమిండియా ఫైనల్కు అర్హత సాధించింది. ఇప్పుడు అందరి కళ్లు న్యూజిలాండ్తో జరగబోయే గ్రాండ్ ఫైనల్పైనే ఉన్నాయి.
Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్తో నూబియా కొత్త ఫోన్.!
తాజావార్తలు
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
-
Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
-
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?