Karnataka Election Results: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ షురూ.. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Election Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్, బ్యాలెట్లు వయోవృద్ధుల ఓట్లు లెక్కిస్తారు. ఈ సారి వయో వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు విధానం కల్పించారు. ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలపై స్పష్టత రానుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనందున, మే 10న ఎన్నికలు జరిగిన కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాల ఫలితాలపైనే అందరి దృష్టి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుండగా, 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు దక్షిణాది రాష్ట్రంలోని 36 నిర్దేశిత కేంద్రాల్లో ఉదయం 8.00 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం కౌంటింగ్కు ముందు తెలిపింది.
2024 సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య దూకుడు పోరు జరిగింది. 224 అసెంబ్లీ సీట్లలో 113 సీట్లు మ్యాజిక్ ఫిగర్గా ఉంది.
ఎన్నికల సంఘం ప్రకారం, మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో 73.19 శాతం ఓటింగ్ నమోదైంది, ఇది దక్షిణాది రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ శాతం నమోదైందని తెలిసింది. 224 స్థానాలున్న కర్ణాటక శాసనసభలో సభ్యులను ఎన్నుకునేందుకు 58,545 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ 113.
Also Read
- Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
- Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్గా..
Read Also: Karnataka Election Results Live Updates: కర్ణాటక తీర్పు.. గెలుపెవరిదో?
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విశ్వాసం వ్యక్తం చేశారు. “హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం లేదు, మేము హాయిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. రేపటి వరకు ఆయన (డీకే శివకుమార్) తన 141 సీట్లతో సంతోషంగా ఉండనివ్వండి. ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి మేము శాసనసభ పక్ష సమావేశం నిర్వహిస్తాము” అని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం కీలక సమావేశం నిర్వహించారు. బెంగళూరులోని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నివాసంలో ఈ సమావేశం జరిగింది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కూడా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో బెంగళూరులోని ఆయన నివాసంలో సమావేశమై ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ వ్యూహంపై చర్చలు జరిపారు.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!