Karnataka Election Results: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ షురూ.. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Election Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్, బ్యాలెట్లు వయోవృద్ధుల ఓట్లు లెక్కిస్తారు. ఈ సారి వయో వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు విధానం కల్పించారు. ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలపై స్పష్టత రానుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనందున, మే 10న ఎన్నికలు జరిగిన కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాల ఫలితాలపైనే అందరి దృష్టి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుండగా, 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు దక్షిణాది రాష్ట్రంలోని 36 నిర్దేశిత కేంద్రాల్లో ఉదయం 8.00 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం కౌంటింగ్కు ముందు తెలిపింది.
2024 సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య దూకుడు పోరు జరిగింది. 224 అసెంబ్లీ సీట్లలో 113 సీట్లు మ్యాజిక్ ఫిగర్గా ఉంది.
ఎన్నికల సంఘం ప్రకారం, మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో 73.19 శాతం ఓటింగ్ నమోదైంది, ఇది దక్షిణాది రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ శాతం నమోదైందని తెలిసింది. 224 స్థానాలున్న కర్ణాటక శాసనసభలో సభ్యులను ఎన్నుకునేందుకు 58,545 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ 113.
Also Read
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
- White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
- US-Iran Deal: యురేనియం వదులుకోవడానికి ఇరాన్ సిద్ధం..!
Read Also: Karnataka Election Results Live Updates: కర్ణాటక తీర్పు.. గెలుపెవరిదో?
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విశ్వాసం వ్యక్తం చేశారు. “హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం లేదు, మేము హాయిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. రేపటి వరకు ఆయన (డీకే శివకుమార్) తన 141 సీట్లతో సంతోషంగా ఉండనివ్వండి. ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి మేము శాసనసభ పక్ష సమావేశం నిర్వహిస్తాము” అని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం కీలక సమావేశం నిర్వహించారు. బెంగళూరులోని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నివాసంలో ఈ సమావేశం జరిగింది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కూడా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో బెంగళూరులోని ఆయన నివాసంలో సమావేశమై ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ వ్యూహంపై చర్చలు జరిపారు.
తాజావార్తలు
-
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
-
IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
-
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
-
Ram Charan: “విరాట్ అంటే ఫైర్.. ధోని అంటే కూల్”.. క్రికెట్ లెజెండ్స్పై చరణ్ క్రేజీ కామెంట్స్
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?