Karnataka Election Results: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ షురూ.. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ
Karnataka Election Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్, బ్యాలెట్లు వయోవృద్ధుల ఓట్లు లెక్కిస్తారు. ఈ సారి వయో వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు విధానం కల్పించారు. ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలపై స్పష్టత రానుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనందున, మే 10న ఎన్నికలు జరిగిన కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాల ఫలితాలపైనే అందరి దృష్టి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుండగా, 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు దక్షిణాది రాష్ట్రంలోని 36 నిర్దేశిత కేంద్రాల్లో ఉదయం 8.00 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం కౌంటింగ్కు ముందు తెలిపింది.
2024 సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య దూకుడు పోరు జరిగింది. 224 అసెంబ్లీ సీట్లలో 113 సీట్లు మ్యాజిక్ ఫిగర్గా ఉంది.
ఎన్నికల సంఘం ప్రకారం, మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో 73.19 శాతం ఓటింగ్ నమోదైంది, ఇది దక్షిణాది రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ శాతం నమోదైందని తెలిసింది. 224 స్థానాలున్న కర్ణాటక శాసనసభలో సభ్యులను ఎన్నుకునేందుకు 58,545 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ 113.
Also Read
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
Read Also: Karnataka Election Results Live Updates: కర్ణాటక తీర్పు.. గెలుపెవరిదో?
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విశ్వాసం వ్యక్తం చేశారు. “హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం లేదు, మేము హాయిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. రేపటి వరకు ఆయన (డీకే శివకుమార్) తన 141 సీట్లతో సంతోషంగా ఉండనివ్వండి. ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి మేము శాసనసభ పక్ష సమావేశం నిర్వహిస్తాము” అని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం కీలక సమావేశం నిర్వహించారు. బెంగళూరులోని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నివాసంలో ఈ సమావేశం జరిగింది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కూడా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో బెంగళూరులోని ఆయన నివాసంలో సమావేశమై ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ వ్యూహంపై చర్చలు జరిపారు.
తాజావార్తలు
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో