Karnataka Assembly Election: రేపే ఫలితాలు.. కర్ణాటకలో గెలుపెవరిది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Assembly Election: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సర్వం సిద్ధమైంది. 34 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రౌండ్ లెక్కింపు ఉదయం 8గంటలకు మొదలవుతోంది. తొలి రౌండ్ 9 గంటలకు పూర్తవుతుంది. బెంగళూరు సిటీలో 4 కేంద్రాలు, మిగతా జిల్లాల్లో 30 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మొత్తం 73.19 శాతం పోలింగ్ రికార్డైంది. అత్యధికంగా చికబల్లాపురా నియోజకవర్గ లో 85.56శాతం నమోదయింది. రాష్ట్రంలో 58వేల 545 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఎక్కడ రిపోలింగ్ జరగలేదు.
మరోవైపు కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ తో గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్.. బెంగళూరుకు రమ్మంటూ అభ్యర్థులకు పిలుపునిచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకూ క్యాంపులోనే ఉండాలని సూచించింది. ఆపరేషన్ లోటస్ భయంతో కాంగ్రెస్ హైకమాండ్ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. మెజారిటీకి కాస్త అటూఇటూగా ఫలితాలు వెలువడితే ఫిరాయింపులు జరిగే అవకాశం ఉందని అధిష్ఠానం భావిస్తోంది. ఆపరేషన్ లోటస్ భయంతో, తమ కేండిడేట్లు చేజారిపోకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
అటు పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలను వెలువరించాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేశాయి.,ఒకవేళ హంగ్ వస్తే… జేడీఎస్ మద్దతు ఇచ్చే పార్టీనే అధికారపీఠాన్ని కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీ లు తమతో సంప్రదింపులు జరిపాయని జేడీఎస్ నేతలు అంటున్నారు. . ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో తాము ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నామని… సరైన సమయంలో ప్రజలకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని స్పష్టం చేశారు. జేడీఎస్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. జేడీఎస్ ను బీజేపీ సంప్రదించలేదని చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా కర్ణాటక ఫలితాల్ని పలువురు భావిస్తున్నారు. దీంతో కర్ణాటక కౌంటింగ్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!