Karnataka Assembly Election: రేపే ఫలితాలు.. కర్ణాటకలో గెలుపెవరిది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Assembly Election: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సర్వం సిద్ధమైంది. 34 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రౌండ్ లెక్కింపు ఉదయం 8గంటలకు మొదలవుతోంది. తొలి రౌండ్ 9 గంటలకు పూర్తవుతుంది. బెంగళూరు సిటీలో 4 కేంద్రాలు, మిగతా జిల్లాల్లో 30 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మొత్తం 73.19 శాతం పోలింగ్ రికార్డైంది. అత్యధికంగా చికబల్లాపురా నియోజకవర్గ లో 85.56శాతం నమోదయింది. రాష్ట్రంలో 58వేల 545 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఎక్కడ రిపోలింగ్ జరగలేదు.
మరోవైపు కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ తో గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్.. బెంగళూరుకు రమ్మంటూ అభ్యర్థులకు పిలుపునిచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకూ క్యాంపులోనే ఉండాలని సూచించింది. ఆపరేషన్ లోటస్ భయంతో కాంగ్రెస్ హైకమాండ్ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. మెజారిటీకి కాస్త అటూఇటూగా ఫలితాలు వెలువడితే ఫిరాయింపులు జరిగే అవకాశం ఉందని అధిష్ఠానం భావిస్తోంది. ఆపరేషన్ లోటస్ భయంతో, తమ కేండిడేట్లు చేజారిపోకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
అటు పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలను వెలువరించాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేశాయి.,ఒకవేళ హంగ్ వస్తే… జేడీఎస్ మద్దతు ఇచ్చే పార్టీనే అధికారపీఠాన్ని కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీ లు తమతో సంప్రదింపులు జరిపాయని జేడీఎస్ నేతలు అంటున్నారు. . ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో తాము ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నామని… సరైన సమయంలో ప్రజలకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని స్పష్టం చేశారు. జేడీఎస్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. జేడీఎస్ ను బీజేపీ సంప్రదించలేదని చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా కర్ణాటక ఫలితాల్ని పలువురు భావిస్తున్నారు. దీంతో కర్ణాటక కౌంటింగ్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..