Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి, భారత్లోని మైనారిటీల పరిస్థితి ఒకేలా ఉందని, రెండు దేశాల మధ్య భేదం లేదని ఆమె అన్నారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ ముఫ్తీ ప్రకటనను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. ఆమె వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమని చెప్పారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని కోరారు.
జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో శనివారం రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిద్దరినీ విచారిస్తున్నారు. సమాచారం ప్రకారం.. దిగువ ముండాలోని గులాబ్ బాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానంగా అటుగా వెళ్తుండటంతో.. అనుమానం వచ్చి వారిని ఆగమని భద్రతా బలగాలు చెప్పారు.
Earthquake: గురువారం జమ్మూ కాశ్మీర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8గా తీవ్రత నమోదైంది. ఒక్కసారి ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గురువారం సాయంత్రం 4.19 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సిఎస్)లో పోస్ట్లో తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్-తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్లో ఇటీవల ఉగ్రవాదులు ఇద్దరు విలేజ్ గార్డుల్ని చంపేశారు. అయితే, ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఘటన వెనక ఉన్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కార్నర్ చేశాయి. వీరిని తుదముట్టించేందుకు భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు మరో జవాన్ గాయపడ్డారు.
Omar Abdullah: దాదాపుగా ఆరేళ్ల తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు ఇటీవల మొదలయ్యాయి. ఈ రోజు అసెంబ్లీ ముగింపులో సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. అటల్ బిహారీ వాజ్పేయి రోడ్మ్యాప్ను అనుసరించినట్లయితే, రాష్ట్రం ఎన్నటికీ కేంద్ర పాలిత ప్రాంతంగా మారేది కాదని అన్నారు.
జమ్మూకశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులు దురదృష్టకరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భద్రతలో ఎలాంటి లోపం లేదని చెప్పారు. ఉగ్రవాదులకు భద్రతా బలగాలు ధీటుగా సమాధానమిస్తున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే లోయలో దాడులు తగ్గాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. రియాసి జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి చెందారు. కొండ రహదారిపై నుంచి వెళ్తుండగా కారు ప్రమాదవశాత్తు లోతైన లోయలో పడిపోయింది. దీంతో.. ఒక మహిళ, ఆమె 10 నెలల కొడుకుతో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ వరస ఉగ్రదాడులతో ఉద్రిక్తంగా ఉంది. వలస కూలీలు, ఆర్మీ జవాన్లు టార్గెట్గా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. సోమవారం అఖ్నూర్ సెక్టార్లో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. జవాన్లు తిరిగి ఉగ్రవాదులపై కాల్పులు జరపడంతో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు ఆ ప్రాంతం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. ఎన్కౌంటర్ కొనసాగుతోంది.
Jammu Kashmir: ఈరోజు ఉదయం 7 గంటలకు జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్లోని శివాలయం సమీపంలోని బట్టల్లో ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన 32 ఫీల్డ్ రెజిమెంట్ వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ చేసింది. కెర్రీలోని బట్టాల్ ప్రాంతంలోని అసన్ దేవాలయం సమీపంలో భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదుల ఉనికి గురించి గ్రామస్థులు సమాచారం అందించారని ఆర్మీ…
India At UN: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి ఐక్యరాజ్యసమితి వేదికగా ‘‘కాశ్మీర్’’ అంశాన్ని లేవనెత్తింది. దీనిపై భారత్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు, శాంతిభద్రతలపై భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని ‘‘రెచ్చగొట్టేవి’’, ‘‘రాజకీయ ప్రచారం’’ అని భారత్ తప్పుపట్టింది. పాకిస్తాన్లోని హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పింది.