Jammu Kashmir: ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యం.. బాడీలపై బుల్లెట్ గాయాలు
- ఉధంపూర్ లో ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యం
- పోలీసుల బాడీల్లో బుల్లెట్లు
- పరస్పర విబేధాలే ఈ ఘటనకు కారణమన్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ లో ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లాలో ఆదివారం ఉదయం ఇద్దరు పోలీసులు బుల్లెట్ గాయాలతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పరస్పర విబేధాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని కాళీమాత ఆలయం వెలుపల పోలీసు వ్యాన్లో బుల్లెట్లతో కూడిన మృతదేహాలు పడి ఉన్నాయని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకొని మరణించినట్లు ప్రాథమిక నివేదికలో తేలిందని అధికారి తెలిపారు. ప్రస్తుతం వివరాలు కోసం వేచి ఉన్నాయి.
READ MORE: UP: దారుణం.. భర్తను కొట్టి ఇంట్లో నుంచి గెంటేసిన భార్య.. ఎందుకంటే?
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఎస్ఎస్పీ ఉధంపూర్ అమోద్ నాగ్పురే మాట్లాడుతూ.. రహమ్బాల్ ప్రాంతంలో ఇద్దరు పోలీసులు ఒకరినొకరు కాల్చుకుని మృతి చెందారు. ఉదయం 6.30 గంటలకు ఘటన చోటు చేసుకుంది. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ ఘటనలో ఎకే-47 రైఫిల్ను ఉపయోగించినట్లు రుజువైంది. అక్కడే ఉన్న మూడో పోలీసు సురక్షితంగా ఉన్నారు. పోస్ట్మార్టం, ఇతర ప్రక్రియల కోసం ఉధంపూర్కు తరలించారు.
READ MORE: Lawrence Bishnoi: “నాపై కుట్ర జరుగుతోంది”.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!