Rajnath Singh: భద్రతా లోపం లేదు.. వరుస ఉగ్రదాడులపై స్పందించిన రక్షణ మంత్రి..
- జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు
- స్పందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
- దాడులు దురదృష్టకరమన్న మంత్రి
- భద్రతా లోపం లేదని స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులు దురదృష్టకరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భద్రతలో ఎలాంటి లోపం లేదని చెప్పారు. ఉగ్రవాదులకు భద్రతా బలగాలు ధీటుగా సమాధానమిస్తున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే లోయలో దాడులు తగ్గాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో విలేకరులతో మాట్లాడిన రాజ్నాథ్ సింగ్.. భద్రత లోపం వల్ల ఈ దాడులు జరగడం లేదని పునరుద్ఘాటించారు. మన భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు ముగిసే సమయం వస్తుందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో దాడులు దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా బలగాలు తగిన సమాధానం ఇవ్వడం వల్ల చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారని గుర్తుచేశారు.
READ MORE: US Bans Indian Companies:15 భారతీయ కంపెనీలపై అమెరికా నిషేధం.. కారణం?
Also Read
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
జమ్మూ కాశ్మీర్లో చాలా చోట్ల ఎన్కౌంటర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీనగర్లోని ఖన్యార్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు సహా నలుగురు గాయపడ్డారు. బందిపొరా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. శుక్రవారం, బుద్గామ్ జిల్లాలోని మజమా ప్రాంతంలో ఉగ్రవాదులు ఇద్దరు కాశ్మీరేతరులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బుద్గాం జిల్లాలోని మగామ్ ప్రాంతంలోని మజామాలో ఇద్దరు కూలీలపై ఉగ్రవాదులు ఈరోజు కాల్పులు జరిపారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించగా.. వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. అక్టోబర్ 29న, ఆర్మీ కాన్వాయ్పై దాడి తర్వాత, అఖ్నూర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అక్టోబరు 20న గందర్బల్ జిల్లాలోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సొరంగం నిర్మాణ స్థలంపై ఉగ్రవాదులు దాడి చేసి ఆరుగురు కార్మికులను హతమార్చారు.
తాజావార్తలు
-
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
-
JanaNayagan : జననాయగన్ మరోసారి సెన్సార్.. అదనంగా మరో 41 సెకండ్స్
-
FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!