Home
Jammu Kashmir
Jammu Kashmir News
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఈ గొడవ ఇలా జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ తెరచాటున భారత్ను కవ్వించే చర్యలకు పాల్పడుతోంది. పీఓకేలో భాగంగా ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్ను పాకిస్తాన్ తన భూభాగంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పాక్లో 5వ ప్రావిన్సుగా(రాష్ట్రం) ఆ దేశ రాజ్యాంగంలో చేర్చాలని చూస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా అనే 4 ప్రావిన్సులు… -
Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా సంచలన ఆరోపణలు చేశారు. ఎన్సీ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.20–30 కోట్ల ఆఫర్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది. -
India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
India At UN: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA)లో దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. దీనికి ప్రతిగా యథావిధిగా భారత్ చేతిలో అవమానాన్ని ఎదుర్కోంది. జమ్మూ కాశ్మీర్ భారత్ అంతర్గత విషయమని, తప్పుడు మరియు కల్పిత కథనాలను వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల్ని ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి భద్రతా మండలి సమర్పించి వార్షిక నివేదికపై జరిగిన చర్చ సమయంలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్… -
Randhir Jaiswal: జమ్మూకాశ్మీర్, లడఖ్ గురించి నోరు జారొద్దు.. ఈయూకు భారత్ సూచన
జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలపై దౌత్యపరంగా శాంతి యుతంగా పరిష్కరించుకోవాలంటూ యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానాల ఉన్నత ప్రతినిధి కాజా కల్లాస్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. -
Jammu Kashmir Encounter: 20 సార్లు తప్పించుకున్నాడు, ఈసారి కుక్కచావు.. జైష్ ఉగ్రవాది సైఫుల్లా అంతం..
Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కీలక విజయం దక్కింది. మోస్ట్ వాంటెంట్ జైషే మహ్మద్ ఉగ్రవాది సైఫుల్లా బలోచ్ హతమ్యాడు. కిష్త్వార్ జిల్లాలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో చచ్చారు. సైఫుల్లాపై రూ. 5 లక్షల రివార్డ్ ఉంది. జమ్మూ కాశ్మీర్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఇతను ఒకడు. ముగ్గురు ఉగ్రవాదులు ఒక గుడిసెలో దాక్కున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్… -
Ranji Trophy 2026: 67 ఏళ్ల కల నిజమైంది.. తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్కు జమ్మూ & కాశ్మీర్
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్లో బెంగాల్ను ఓడించి తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీ-ఫైనల్ మ్యాచ్లో నాల్గవ రోజు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించారు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్కు ఇది ఒక చారిత్రాత్మక క్షణం. ఈ విజయానికి నిజమైన హీరో ఆకిబ్ నబీ, ఈ మ్యాచ్లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు, అందులో మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కూడా ఉన్నాయి. అబ్దుల్… -
Jammu Kashmir: కాశ్మీర్ ఎవరిది..? పాకిస్తాన్కు అమెరికా క్లియర్ మెసేజ్..
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ త్వరలో పాకిస్తాన్లో భాగం అవుతుందని ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ తమదే అని దయాది దేశం చెబుతుంటుంది. అయితే, నిజంగా జమ్మూ కాశ్మీర్, పీఓకేతో సహా ఎవరిదో అమెరికా స్పష్టం చేసింది. ఇప్పటికే భారత్-అమెరికా ట్రేడ్ డీల్తో ఇబ్బందులు పడుతున్న దాయాది దేశానికి, అమెరికా మరో షాక్ ఇచ్చినట్లైంది. పూర్తిగా జమ్మూ కాశ్మీర్ ఉన్న భారత మ్యాప్ను ప్రదర్శించింది. -
Omar Abdullah: ఉన్నదాన్నే సరిగా చూసుకోవడం లేదు, మీకు కాశ్మీర్ కావాలా..?
Omar Abdullah: కాశ్మీర్ను భారత్ నుంచి స్వాధీనం చేసుకుంటామని, కాశ్మీర్ పాకిస్తాన్ ‘‘జీవనాడి’’ అని, ఏదో రోజు పాకిస్తాన్లో భాగమవుతుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్కు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ధీటుగా సమాధానం ఇచ్చారు. పాక్ వద్ద ఉన్న ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(పీఓకే)నే సరిగా చూసుకోవడం లేదని వారికి కాశ్మీర్ కావాలా.? అని ప్రశ్నించారు. -
Jammu kashmir: పాక్ ఉగ్రవాది ఖతం.. భద్రతా బలగాలకు కీలక విజయం..
Jammu kashmir: జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో శుక్రవారం జరిగిన కాల్పుల్లో జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న పాకిస్తానీ ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. భద్రతా బలగాలకు ఇది కీలక విజయంగా భావిస్తు్న్నారు. కథువా జిల్లాలోని బిల్లావర్ జనరల్ ప్రాంతంలో ఆర్మీ, సీఆర్పీఎఫ్ కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో ఒక పాకిస్తానీ జైష్ ఉగ్రవాదిని మట్టుపెట్టినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు చెప్పారు. -
Jammu Kashmir: కాశ్మీర్లో ‘ఉగ్ర’వేట.. ఏడుగురు సైనికులకు గాయాలు..
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో కిష్త్వార్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం మధ్యాహ్నం నుంచి కాల్పులు ప్రారంభయ్యాయి. సైన్యానికి చెందిన ఏడుగురు సైనికులు ఈ ఆపరేషన్లో గాయపడినట్లు తెలుస్తోంది. కఠిమైన పర్వత ప్రాంతాల్లో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి.
తాజావార్తలు
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Sachin Tendulkar: “ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
-
Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!