Woman flees with lover: ప్రస్తుత కాలంలో వివాహ వ్యవస్థకు గౌరవం లేకుండా పోతోంది. క్షణకాలం సుఖం కోసం చాలా కాపురాలు కూలిపోతున్నాయి. పిల్లలను, భర్తను వదిలేసి కొందరు మహిళలు ప్రియుడితో పారిపోతున్నారు. మరికొందరు ప్రియుడి సాయంతో భర్తను అడ్డుతొలగించుకునేందుకు హత్యలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు ఎక్కువ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా పరిచమైన వ్యక్తులతో స్నేహం, ప్రేమగా మారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Amit Shah: కాశ్మీర్కి హిందూమతంలో గౌరవనీయులైన ఋషి కశ్యపుడి పేరు పెట్టడం సాధ్యమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం అన్నారు. ఢిల్లీలో ‘‘జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజెస్’’ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
Heavy Snowfall: జమ్మూ కశ్మీర్లో మంచు భారీగా కురుస్తుంది. దీని ప్రభావం జనవరి 2 వరకు ఉంటుందని, కొన్ని కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భారీగా మంచు కురిస్తుండటంతో ఈరోజు (డిసెంబర్30) జరగాల్సిన కాశ్మీర్ యూనివర్సిటీ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి.
Manmohan Singh: భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపిన రూపశిల్పి, 10 ఏళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. భారతదేశం దివాళా తీసే స్థితి నుంచి ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే ఇందులో మన్మోహన్ కృషి మరవలేనిది. 1991 ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఆర్థిక మంత్రిగా అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. భారత మార్కెట్ని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేయడానికి ఆయన ఎన్నో చర్యలు…
ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత.. జరిగిన మొదటి ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. 90 స్థానాలకు గానూ.. రెండు పార్టీలు కలిసి 48చోట్ల గెలిచాయి. జమ్మూలో తన పట్టును నిలుపుకొన్న భాజపా.. 29 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అసెంబ్లీ ఏర్పడి రెండు నెలలకు పైగా గడిచింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని అనారోగ్యం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ గుర్తు తెలియని అనారోగ్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 08కి చేరింది. బుధవారం ఇక్కడ ఆస్పత్రిలో మరో చిన్నారి వ్యాధి కారణంగా మరణించింది. దీంతో ఈ వ్యాధిని గుర్తించేందుకు కేంద్రం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
Jammu and Kashmir: జమ్ము కశ్మీర్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ లో ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లాలో ఆదివారం ఉదయం ఇద్దరు పోలీసులు బుల్లెట్ గాయాలతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పరస్పర విబేధాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు ఘన విజయం లభించింది. గందర్బాల్లో ఓ ప్రైవేట్ కంపెనీ హౌసింగ్ క్యాంపులో ఆరుగురు కార్మికులను, వైద్యుడిని చంపేసిన ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఉగ్రవాదిని పాకిస్తాన్కి చెందిన లష్కరేతోయిబాకి చెందిన జునైద్ అహ్మద్ భట్గా గుర్తించారు. ఈ ఉగ్రవాది గగాంగీర్, ఇతర ప్రదేశాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో కూడా పాల్గొన్నాడు.