Mehbooba Mufti: ‘‘భారత్, బంగ్లాదేశ్ మధ్య తేడా లేదు’’.. మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- మైనారిటీ అణివేతలో భారత్, బంగ్లాదేశ్ మధ్య తేడా లేదు..
- జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- జాతి వ్యతిరేక ప్రకటన, వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి, భారత్లోని మైనారిటీల పరిస్థితి ఒకేలా ఉందని, రెండు దేశాల మధ్య భేదం లేదని ఆమె అన్నారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ ముఫ్తీ ప్రకటనను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. ఆమె వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమని చెప్పారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని కోరారు.
బంగ్లాదేశ్లో హిందువులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, భారత్ లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతుంటే, భారత్ బంగ్లాదేశ్కి తేడా ఏంటి..? ఈ రెండు దేశాల మధ్య నాకు ఎలాంటి తేడా కనిపించడం లేదని పార్టీ కార్యకర్తల మీటింగ్లో ముఫ్తీ అన్నారు. మనకు ఇంత గొప్ప దేశం ఉందని, సెక్యులర్ స్వభావంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని ఆమె అన్నారు.
Also Read
Read Also: S Jaishankar: ‘‘టిప్పు సుల్తాన్ చరిత్ర చాలా క్లిష్టమైన వ్యక్తి’’.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
బంగ్లాదేశ్లో హిందూ మతగురువు చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుపై నిరసనలు జరుగుతున్న వేళ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ పరిస్థిని భారత్తో పోల్చడం పూర్తిగా ఖండిచదగినందని, బంగ్లాదేశ్లో అత్యంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రపంచానికి తెలుసు, ఇక్కడ మైనారిటీ సమాజం లక్ష్యంగా దాడులు, మహిళల అవమానాల గురించి ప్రపంచానికి తెలుసని జమ్మూ కాశ్మీర్ మాజీ బీజేపీ చీఫ్ రవిందర్ రైనా అన్నారు. ఎన్నికైన ప్రధాని దేశం విడిచి పారిపోయేటట్లు చేయడం, ఆ దేశ జాతిపతను అగౌరపరడంపై ఆయన మాట్లాడారు.
జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపి) సునీల్ శర్మ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తర్వాత మెహబూబా ముఫ్తీ తన పార్టీని పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నమని అన్నారు. పీడీపీ పూర్తిగా మునిగిపోయింది, మెహబూబా తన పార్టీని మళ్లీ స్థాపించేందుకు ముస్లింలను రెచ్కచగొట్టడానికి ఇలాంటి ప్రకటన చేస్తోందని ఆయన ఆరోపించారు. సంభాల్ మసీదు సర్వే సమయంలో జరిగిన హింస గురించి ముఫ్తీ మాట్లాడుతూ.. కొందరు షాపుల్లో పనిచేసే వారిని చంపేశారని అన్నారు. 1947 నాటి పరిస్థితులు వస్తున్నాయని ఆమె కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!