Mehbooba Mufti: ‘‘భారత్, బంగ్లాదేశ్ మధ్య తేడా లేదు’’.. మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- మైనారిటీ అణివేతలో భారత్, బంగ్లాదేశ్ మధ్య తేడా లేదు..
- జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- జాతి వ్యతిరేక ప్రకటన, వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి, భారత్లోని మైనారిటీల పరిస్థితి ఒకేలా ఉందని, రెండు దేశాల మధ్య భేదం లేదని ఆమె అన్నారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ ముఫ్తీ ప్రకటనను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. ఆమె వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమని చెప్పారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని కోరారు.
బంగ్లాదేశ్లో హిందువులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, భారత్ లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతుంటే, భారత్ బంగ్లాదేశ్కి తేడా ఏంటి..? ఈ రెండు దేశాల మధ్య నాకు ఎలాంటి తేడా కనిపించడం లేదని పార్టీ కార్యకర్తల మీటింగ్లో ముఫ్తీ అన్నారు. మనకు ఇంత గొప్ప దేశం ఉందని, సెక్యులర్ స్వభావంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని ఆమె అన్నారు.
Also Read
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
Read Also: S Jaishankar: ‘‘టిప్పు సుల్తాన్ చరిత్ర చాలా క్లిష్టమైన వ్యక్తి’’.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
బంగ్లాదేశ్లో హిందూ మతగురువు చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుపై నిరసనలు జరుగుతున్న వేళ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ పరిస్థిని భారత్తో పోల్చడం పూర్తిగా ఖండిచదగినందని, బంగ్లాదేశ్లో అత్యంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రపంచానికి తెలుసు, ఇక్కడ మైనారిటీ సమాజం లక్ష్యంగా దాడులు, మహిళల అవమానాల గురించి ప్రపంచానికి తెలుసని జమ్మూ కాశ్మీర్ మాజీ బీజేపీ చీఫ్ రవిందర్ రైనా అన్నారు. ఎన్నికైన ప్రధాని దేశం విడిచి పారిపోయేటట్లు చేయడం, ఆ దేశ జాతిపతను అగౌరపరడంపై ఆయన మాట్లాడారు.
జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపి) సునీల్ శర్మ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తర్వాత మెహబూబా ముఫ్తీ తన పార్టీని పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నమని అన్నారు. పీడీపీ పూర్తిగా మునిగిపోయింది, మెహబూబా తన పార్టీని మళ్లీ స్థాపించేందుకు ముస్లింలను రెచ్కచగొట్టడానికి ఇలాంటి ప్రకటన చేస్తోందని ఆయన ఆరోపించారు. సంభాల్ మసీదు సర్వే సమయంలో జరిగిన హింస గురించి ముఫ్తీ మాట్లాడుతూ.. కొందరు షాపుల్లో పనిచేసే వారిని చంపేశారని అన్నారు. 1947 నాటి పరిస్థితులు వస్తున్నాయని ఆమె కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!