Israeli Strike On Syria: ఇజ్రాయిల్ సిరియాపై విరుచుకుపడింది. రాజధాని డమాస్కస్పై దాడులు చేసింది. ఈ దాడుల్లో సిరియాకు చెందిన ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మరియు అతని డిప్యూటీతో పాటు మరో ఇద్దరు గార్డ్స్ సభ్యులు శనివారం మరణించినట్లు ఇరాన్ మీడియా నివేదించింది. రివల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటనలో.. సిరియా రాజధానిపై జరిగిన స్ట్రైక్స్లో నలుగురు సభ్యులు మరణించినట్లు ధృవీకరించింది.
Israel: అక్టోబర్ 7నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్పై దాడులకు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మరింత తీవ్రతరం చేస్తోంది. హమాస్ ఉగ్రవాదుల్ని పూర్తిగా తుదముట్టించే వరకు వదిలేది లేదని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వెల్లడించారు. ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు. మరోవైపు తాజాగా నెతన్యాహూ మాట్లాడుతూ.. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేది లేదని స్పష్టం చేశారు.
చిరకాల మిత్రదేశాలైన ఇజ్రాయెల్- అమెరికా మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. హమాస్ నియంత్రణలోని గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకోవడానికి ఇదే సరైన సమయమంటూ చేసిన అమెరికా చేసిన సూచనను ఇజ్రాయెల్ తిరస్కరించింది.
India-Maldives row: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ని సందర్శించడం, అక్కడి టూరిజాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవుల్లో ప్రకంపలను రేపుతోంది. మోడీ టూర్ని ఉద్దేశిస్తూ అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. ఇండియన్స్ తమ మాల్దీవ్స్ టూర్లను క్యాన్సల్ చేసుకుంటున్నారు. ఆ దేశంలోని హోటల్స్ బుకింగ్ రద్దవ్వడమే కాదు, టూర్ కోసం ముందుగా చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక లక్షద్వీప్పై భారత నెటిజన్లతో పాటు విదేశీయులు కూడా సెర్చ్ చేస్తున్నారు.
Benjamin Netanyahu: ఇజ్రాయిల్ తన అన్ని లక్ష్యాలను సాధించే వరకు యుద్ధాన్ని ఆపబోదని మరోసారి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ నాశనం అయ్యేంత వరకు గాజా యుద్ధం ఆగేది లేదని ప్రకటించారు. మూడు నెలల క్రితం హమాస్ మాపై దారుణమైన దాడికి పాల్పడ్డారు, హమాస్ నిర్మూలించాలని, బందీలను తిరిగి తీసుకురావాలని, గాజా నుంచి ఇజ్రాయిల్పై మరోసారి దాడులు ఎదురుకావద్దని తాను ఇజ్రాయిల్ ఆర్మీని ఆదేశించినట్లు ప్రధాని నెతన్యాహూ చెప్పారు.
Israel: ఇజ్రాయిల్ అక్టోబర్ 7 నాటి హమాస్ మిలిటెంట్ల దాడి తర్వాత, హమాస్ని కుప్పకూల్చాలనే లక్ష్యంలో బిజీగా ఉండగా.. మరోవైపు లెబనాన్ నుంచి హమాస్కి మద్దతుగా హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా హిజ్బుల్లా ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంలోని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) స్థావరాలపై రాకెట్ల వర్షం కురిపించారు. శనివారం ఇజ్రాయిల్ సైనిక స్థావరాలపై 60కి పైగా రాకెట్లను ప్రయోగించినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. బీరూట్లో హమాస్ డిప్యూటీ లీడర్ని హతమార్చినందుకు ప్రతిస్పందనగా ఈ దాడికి పాల్పడినట్లు వివరించింది.
Hamas: హమాస్ ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 7 నాటి దాడి సమయంలో మహిళలపై హమాస్ ఉగ్రవాదులు అత్యాచారాలకు పాల్పడుతూ, వారిని హత్యలు చేశారు. చిన్న పెద్దా, ముసలి వారనే తేడా లేకుండా హత్యలు చేశారు. చిన్న పిల్లల తలలను వేరు చేస్తూ రాక్షస ఆనందం పొందారు. ఆ దాడి సమయంలో జరిగిన సంఘటనల గురించి ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. సీఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బందీల్లో ఒకరైన రాజ్ కోహెన్ హమాస్ ఉగ్రవాదుల…
Sam Altman: ఒపెన్ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్-గాజా యుద్ధం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. టెక్ పరిశ్రమలో ముస్లిం, అరబ్ కమ్యూనిటీ సభ్యులు ఇటీవల తన అనుభవాల గురించి మాట్లాడేందుకు అసౌకర్యంగా ఉన్నారని ఆయన గురువారం అన్నారు.
Islamic State: ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాజీ చీఫ్ ఖాసిం సులేమానీ స్మారకార్థం, ఆయన హత్యకు గురై నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా.. ఇరాన్ లోని కెర్మాన్లో శ్రద్ధాంజలి ఘటించేందుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలో జరిగిన రెండు భారీ బాంబు పేలుళ్లలో 103 మంది మరణించారు. అయితే ఈ దాడి తమ పనే అని ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించింది. టెలిగ్రామ్ ఛానెల్లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.
ది హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తుందని, ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా వేసిన కేసుల జనవరి 11, 12న విచారిస్తామని కోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. జెనోసైడ్ కన్వెన్షన్ కింద ఇజ్రాయెల్ తన బాధ్యతలను ఉల్లంఘించిందని, గాజా ప్రజలపై మారణహోమానికి పాల్పడుతోందని, ఇది మరింత ప్రమాదాన్ని పెంచుతోందని దక్షిణాఫ్రికా గత శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది.