Sam Altman: ఒపెన్ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్-గాజా యుద్ధం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. టెక్ పరిశ్రమలో ముస్లిం, అరబ్ కమ్యూనిటీ సభ్యులు ఇటీవల తన అనుభవాల గురించి మాట్లాడేందుకు అసౌకర్యంగా ఉన్నారని ఆయన గురువారం అన్నారు.
Islamic State: ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాజీ చీఫ్ ఖాసిం సులేమానీ స్మారకార్థం, ఆయన హత్యకు గురై నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా.. ఇరాన్ లోని కెర్మాన్లో శ్రద్ధాంజలి ఘటించేందుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలో జరిగిన రెండు భారీ బాంబు పేలుళ్లలో 103 మంది మరణించారు. అయితే ఈ దాడి తమ పనే అని ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించింది. టెలిగ్రామ్ ఛానెల్లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.
ది హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తుందని, ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా వేసిన కేసుల జనవరి 11, 12న విచారిస్తామని కోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. జెనోసైడ్ కన్వెన్షన్ కింద ఇజ్రాయెల్ తన బాధ్యతలను ఉల్లంఘించిందని, గాజా ప్రజలపై మారణహోమానికి పాల్పడుతోందని, ఇది మరింత ప్రమాదాన్ని పెంచుతోందని దక్షిణాఫ్రికా గత శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది.
Iran Blasts: ఇరాన్ రివల్యూషనరీ జనరల్ ఖాసిం సులేమాని మరణించి నాలుగేళ్లు అవుతున్న నేపథ్యంలో ఆయన సంస్మరణ సభ నిర్వహిస్తున్న కార్యక్రమంలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ల వల్ల 95 మంది చనిపోయారు. అయితే ఈ పేలుళ్లకు అమెరికా, ఇజ్రాయిల్ కారణమని ఇరాన్ బుధవారం నిందించింది. గాజా యుద్ధం నేపథ్యంలో మరోసారి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ఇరాన్ దాడిలో తమ ప్రమేయం లేని అమెరికా చెప్పింది. ఇదిలా ఉంటే ఈ దాడిపై ఇజ్రాయిల్…
Israel: హమాస్ నాయకత్వాన్ని తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయిల్ కదులుతోంది. తాజాగా హమాస్ డిప్యూటీ చీఫ్ సలేహ్ అల్-అరౌరీని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చంపేసింది. లెబనాన్ రాజధాని బీరూట్లో ఉన్న అల్-అరౌరీపై దాడి చేసి హతమార్చింది. మంగళవారం జరిగిన ఈ ఘటన మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు ఈ దాడిని లెబనాన్ ప్రధాని ఖండించారు. మరోవైపు ఇతని మరణానికి హమాస్తో పాటు హిజ్బుల్లా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించాయి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య అక్టోబర్ నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకు గాజాలోని హమాస్కు భారీ నష్టం కలిగించింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడిలో దాదాపు 100 మంది పాలస్తీనియన్లు మరణించగా.. 158 మంది గాయపడ్డారు.
ఇజ్రాయెల్ ఆర్మీ తాజాగా మరోసారి గాజాపై కవ్వింపులకు పాల్పడింది. గాజా నుంచి తిరిగి వస్తున్న సహాయ కాన్వాయ్పై ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థ ఈ ఘటనను వెల్లడించింది. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని స్పష్టం చేసింది. కాగా గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ బాంబు దాడుల్లో ఇప్పటికే 20,000 మందికి పైగా పాలస్తీనా ప్రజలు మరణించగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. అయితే గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ…
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హమాస్ ఉగ్రసంస్థను నేలమట్టం చేసేదాకా యుద్ధాన్ని ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రపంచదేశాల నుంచి వస్తున్న ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా హమాస్పై పోరుసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే గాజాలోని హమాస్ కీలక టన్నెల్ వ్యవస్థనున కుప్పకూల్చేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఆ టన్నెల్స్ని సముద్ర నీరుతో ముంచేయాలని ప్లాన్ చేసింది.
Drone Strike: హిందూ మహా సముద్రంలోని ఓ వ్యాపార నౌకపై డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ దాడితో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. లైబీరియా జెండాతో ఉన్న ట్యాంకర్ ఇజ్రాయిల్ అనుబంధంగా ఉందని తెలుస్తోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ నుంచి వచ్చే నౌకల్ని లేకపోతే ఇజ్రాయిల్ అనుబంధంగా పనిచేస్తున్న నౌకల్ని యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు టార్గెట్ చేస్తున్నారు. హౌతీ తిరుగుబాటుదారులకు మద్దతుగా ఇరాన్ వ్యవహరిస్తోందని అమెరికాతో పాటు పలు…
Ivanka Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఇజ్రాయిల్ని సందర్శించనున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై హమాస్ దాడి చేసింది. ఈ దాడిలో బాధితులను ఇవాంకా ట్రంప్ కలుసుకున్నారు. భర్త జారెడ్ కుష్నర్తో కలిసి బాధితులను పరామర్శించారు.