Tejaswi Yadav: బీహార్లో జేడీయూ శకం ముగిసింది.. నితీష్ను బీజేపీ హైజాక్ చేసిందన్న తేజస్వి యాదవ్
- నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంపై స్పందించిన తేజస్వి యాదవ్
- బీహార్లో జేడీయూ శకం ముగిసింది
- నితీష్ను బీజేపీ హైజాక్ చేసిందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ ఎన్నికల వేళ బీహార్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనూహ్యంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా కీలక మలుపు తిరిగాయి. ఇంత సడన్గా నితీష్ కుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.
తాజాగా ఇదే అంశంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. ఇక బీహార్లో జేడీయూ మనుగడ సాధించదని.. ఆ పార్టీ శకం ముగిసిందని ఆరోపించారు. నితీష్ కుమార్ను బీజేపీ హైజాక్ చేసిందని.. మిత్రులను తినేస్తోందని వ్యాఖ్యానించారు. ఓబీసీ లేదా అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. ప్రస్తుత పరిణామాలు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా ఉండనివ్వదని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు.
Also Read
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- Maharashtra: "ఇది కదా విశ్వాసం అంటే".. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
- Food Inflation 2026: వంటగది బడ్జెట్కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
- DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
ఇది కూడా చదవండి: Heat waves: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు.. హడలెత్తిపోతున్న ప్రజలు
‘‘మహారాష్ట్రలో ఏం జరిగింది? తొలుత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత బీజేపీ హైజాక్ చేయలేదా? ఇప్పుడు బీహార్లో కూడా అదే జరిగింది. జేడీయూలోని కొంత మంది బీజేపీతో కుమ్మక్కయ్యారు. అందుకే ఇంత వేగంగా పరిణామాలు మారిపోయాయి.’’ అని తేజస్వి యాదవ్ చెప్పుకొచ్చారు. ఇక నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ రాజకీయ ప్రవేశంపై స్పందిస్తూ.. ‘‘ఇప్పటికే ఆలస్యమైందని.. చాలా సంవత్సరాల క్రితమే వచ్చి ఉండాల్సింది. కొంత మంది కావాలనే అతడిని అడ్డుకున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Sonu Sood: రంగంలోకి హీరో సోనూసూద్.. దుబాయ్లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!
#WATCH पटना: बिहार विधानसभा में विपक्ष के नेता तेजस्वी यादव ने कहा, "चुनाव में जिस तरह से उनकी जीत हुई है, धनतंत्र की, मशीनतंत्र की जीत हुई है…नीतीश कुमार ने कहा है कि वो (राज्यसभा)सदन जाना चाहते हैं…हम शरुआत से इस बात को कहते रहे हैं कि चुनाव के बाद नीतीश कुमार को भाजपा के… pic.twitter.com/33v3ZhH3N7
— ANI_HindiNews (@AHindinews) March 5, 2026
- Tags
- bihar
- JDU
- nitish kumar
- Rajya Sabha
- RJD
తాజావార్తలు
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్మన్, గిల్క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
-
Meloni-Trump: ట్రంప్తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!