Iran-Israel: కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఏ క్షణంలోనైనా దాడులు.. అన్ని దేశాలు అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ అలుముకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు తెగబడవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా.. ఇజ్రాయెల్ను అప్రతమత్తం చేసింది. ఇటీవల సిరియా రాజధాని డమస్క్లో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో పలువురు ఇరానీ ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గాజాపై దాడిని కూడా ఇరాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై దాడి చేయాలని ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఇప్పటికే అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై దాడులు జరగొచ్చని సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ కూడా అప్రమత్తం అయింది. ఇరాన్ను ధీటుగా ఎదుర్కొనేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Gadchiroli : 130 డ్రోన్లు, 17 హెలికాప్టర్లు, 15 వేల మంది సైనికులు గడ్చిరోలిలో ఓటింగ్పై గట్టి నిఘా
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఆయా దేశాలు తమ పౌరులను అలర్ట్ చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని సూచించాయి. ఫ్రాన్స్, భారత్, రష్యా, పోలాండ్, అమెరికా సహా పలు దేశాలు.. ఇజ్రాయెల్ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశాయి. తాము సమాచారం తెలియజేసే వరకూ వెళ్లొద్దని పేర్కొన్నాయి. ఇక తమ పౌరులు భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది.
ఇది కూడా చదవండి: Cricket Betting: ప్రాణాలు తీసిన క్రికెట్ బెట్టింగ్.. కాకినాడలో యువకుడి ఆత్మహత్య
ఇక ఇజ్రాయెల్ను అమెరికా అప్రమత్తం చేస్తూనే.. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేసి భరోసా ఇచ్చారు. ఇరాన్ ఏ క్షణంలోనే దాడులకు పాల్పడొచ్చని.. అందుకు సిద్ధంగా ఉండాలని అలర్ట్ చేసింది. మరోవైపు జర్మన్ సహా పలు దేశాలు విమాన సర్వీసులను రద్దు చేశాయి. మరోవైపు గత ఆరు నెలలుగా గాజా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సాగుతోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఇళ్లులు నేలమట్టం అయ్యాయి. ఇంకా యుద్ధం సాగుతూనే ఉంది. మరోవైపు దాడులకు విరామం ప్రకటించాలని ఇజ్రాయెల్తో చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇంతలోనే మరో ముప్పు పొంచి ఉంది. తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగేటట్లు సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Rains: ఐదు రోజుల పాటు వర్షాలు.. ఎల్లో, ఆరేంజ్ అలర్ట్ జారీ
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!