Rajamahendravaram: రోజుకో ప్రాణం తీస్తున్న కల్తీ పాలు.. 9కి చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురైన ఘటనలో రోజుకో ప్రాణం గాల్లో కలుస్తోంది. తాజాగాఈ ఘటనలో మరో మహిళ మృతి చెందారు. లాలాచెరువు ప్రాంతానికి చెందిన జి. వెంకటలక్ష్మి (69) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆమె రాజమండ్రిలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 9కు చేరింది. గత నాలుగు రోజులుగా వరుసగా ప్రతిరోజూ ఒక్కొక్కరు మృతి చెందడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన మరో 11 మంది ప్రస్తుతం నాలుగు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురు వెంటిలేటర్పై ఉండి డయాలసిస్ చికిత్స తీసుకుంటుండగా, మరో నలుగురికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తుండగా, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం