రావణాసురుడి భార్య మండోదరి జన్మస్థలం మందసౌర్ అని పిలుస్తుంటారు. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడిని తమ అల్లుడిగా భావిస్తారు. అందుకే అల్లుడి మరణం వాళ్లకు సంతోషాన్ని ఇవ్వదు.. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడి దహనం చేసేందుకు ఇష్టపడరు.
Pentagon Report: భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి 2022లో సైనికి ఉనికిని, మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని పెంచింది. ఈ విషయాలను అమెరికా పెంటగాన్ నివేదిక వెల్లడించింది. ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ నివేదిక 2023 ప్రకారం.. భూగర్భ నిల్వ సౌకర్యాలు, కొత్త రోడ్లు, డ్యూయల్ పర్పస్ ఎయిర్ పోర్టులు, హెలిప్యాడ్ల నిర్మాణాలు ఎల్ఏసీ వెంబడి పెరిగాయి.
న్యూజిలాండ్ ఆటగాళ్లకు పాకిస్తాన్ షెహర్ షిన్వారీ ఆఫర్ ఇచ్చింది. ఈసారి న్యూజిలాండ్ బౌలర్ జిమ్మీని ఉద్దేశించి ట్వీట్ చేసింది. ‘‘హే జిమ్మీ నీష్ (జేమ్స్ నీషామ్) నీవు భారత జట్టును ఓడిస్తే గనుక, మేము పాకిస్థానీలం నిన్ను తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటాం’’అంటూ ఓ కామెడీ ట్వీట్ చేసింది. అయితే ఇవాళ్టి మ్యాచ్ లో జేమ్స్ నీషామ్ ఆడటం లేదు. అయినా షెహర్ కు ఇలాంటి పరాభవాలు కొత్తేమీ కాదు. అందుకే ఈ నటిని నెటిజన్లు తెగ ట్రోల్…
India's aid to Gaza: ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం నడుమ గాజాలోని సాధారణ పాలస్తీనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ రాకెట్ ఎటునుంచి వస్తుందో అని, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో అని భయపడుతున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ ని దిగ్భంధించింది. ఉత్తర గాజాలోని ప్రజలను సురక్షితమైన దక్షిణ ప్రాంతాలకు వెళ్లాలని సూచించడంతో, ఆ ప్రాంతంలోని 10 లక్షల మందిలో 7 లక్షల మంది దక్షిణ వైపు వెళ్లారు.
న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ విషయమై టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించారు. ఈరోజు జరిగే గ్రూప్ దశ మ్యాచ్ లో కివీస్ చేతిలో ఇండియా ఓటమి పాలైనా తాను పెద్దగా పరిగణనలోకి తీసుకోబోనని రవిశాస్త్రి పేర్కొన్నారు. 2011 ప్రపంచకప్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇచ్చిన సూచనను ఈ సందర్భంగా శాస్త్రి గుర్తు చేశారు.
ఐపీఎల్ అంటే క్రికెట్ లవర్స్కు పండగే. ఏడాదికోసారి జరిగే ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే కరోనా సమయంలో భారత్లో ఐపీఎల్ నిర్వహించలేదు. ఐపీఎల్ 2024 సీజన్ కూడా వేరే దేశాల్లో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్కు ఇదొక చేదువార్తలా చెప్పవచ్చు. ఐపీఎల్ భారత్లో జరగకపోవడానికి గల కారణాలేంటంటే.. వచ్చే ఏడాదే భారత్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సరిగ్గా ఐపీఎల్ జరిగే సమయంలోనే ఎన్నికలు వస్తున్నాయి.
హార్థిక్ పాండ్యా లేని లోటును భర్తీ చేసుకోవడం కోసం టీమ్లో రెండు మార్పులు అవసరమని భజ్జీ సూచించాడు. ధర్మశాల పిచ్ ఎక్కువగా స్వింగ్ అవుతుందని.. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు బదులు సీమర్ మహమ్మద్ షమీకి అవకాశం కల్పించాలని తెలిపాడు. అంతేకాకుండా.. 6వ స్థానంలో ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్ను ఆడించాలని పేర్కొ్న్నాడు.
షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ పై భారత మాజీ దిగ్గజం ఇర్ఫాన్ పఠాన్తో పాటు పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. “బెంగళూరులోని ఈ ఫ్లాట్ పిచ్పై షాహీన్ 5 వికెట్లు తీయడం గొప్ప అని చెప్పుకొచ్చాడు. కేవలం షాహీన్ తప్ప.. మిగతా బౌలర్లు ఫెయిలయ్యారని విమర్శించాడు. మిగతా నెటిజన్లు కూడా స్పందించారు.
వరల్డ్ కప్ 2023లో నాలుగింటిలో నాలుగు విజయాలు అందుకుని టీమిండియా జోరు మీదుంది. ఇక భారత్ తన 5వ మ్యాచ్ ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో తలపడనుంది. అందుకోసం భారత్.. ధర్మశాలకు చేరుకుంది. అక్టోబర్ 22న న్యూజిలాండ్-భారత్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
అంతరిక్ష రంగ అభివృద్ధికి ప్రభుత్వం రోడ్మ్యాప్ను రూపొందించిందని, స్వదేశీయంగా నిర్మించిన అంతరిక్ష నౌకలో భారతీయుడు చంద్రునిపైకి వెళ్లే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు.