Haryana Shocker: లవర్కు రంగులు రాశాడని, ఫ్రెండ్ దారుణహత్య..
- హర్యానాలో దారుణం..
- లవర్కు రంగులు రాశాడని, స్నేహితుడి దారుణహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana Shocker: తన ప్రేయసికి రంగులు పూశాడనే కారణంగా ఒక వ్యక్తి 23 ఏళ్ల యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హర్యానాలోజరిగింది. హత్యను రైలు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు యువకుడి మృతదేహాన్ని రైల్వే ట్రాక్పై పడేశారని పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలోని పానిపట్లో ఈ ఘటన జరిగింది.
హోలీ పండగ రోజున కాలు అనే వ్యక్తి అదృశ్యమ్యాడు. ఆ తర్వాత అతడి మృతదేహం రైల్వే ట్రాక్పై దొరికింది. మొదట్లో దీనిని రైలు ప్రమాదంగా అంతా భావించారు. అయితే, , ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) జరిపిన దర్యాప్తులో ఇది ముందుగానే పథకం ప్రకారం చేసిన అత్యంత కిరాతకమైన హత్య అని తేలింది. ఈ కేసులో మహమూద్పూర్కు చెందిన సంజు, రాహుల్, విశాల్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
Read Also: Pak-Afghan war: 400 మంది మృతి.. పాకిస్తాన్పై అఫ్ఘాన్ క్రికెటర్ల ఆగ్రహం..
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. హోలీ రంగుల వివాదం, గతంలో ఉన్న వ్యక్తిగత కక్షల కారణంగా హత్య జరిగినట్లు తెలిసింది. విచారణలో ముగ్గురు నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ కుట్ర వెనక ప్రధాన సూత్రధారి సంజు అని పోలీసులు గుర్తించారు. హోలీ రోజున సంజు ప్రేయసికి కాలు రంగులు పూయడంతో గొడవ ప్రారంభమైంది. దీని తర్వాత హత్యకు సంజు ప్లాన్ చేసినట్లు తేలింది. ఘటన రోజున కాలును సంజు బయటకు రావాలని కోరాడు. ముగ్గురు నిందితులతో కలిసి కాలు మద్యం సేవించాడు. కాలుతో ఎక్కువ మందు తాగించారు.
కాలు మద్యం మత్తులో ఉన్నప్పుడు ,అతడిని బైక్పై రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడే సంజు స్క్రూడ్రైవర్తో అతని మెడపై రెండుసార్లు దాడి చేశాడు. అయినప్పటికీ, ఈ దాడి జరిగినప్పటికీ కాలు మరణించలేదు. ఆ తర్వాత కాలు కాళ్లు చేతులు కట్టేసి, రైల్వే ట్రాక్పై పడుకోబెట్టారు. మద్యం మత్తు, గాయాల వల్ల కాలు కదలలేకపోయాడు. నిందితులు అక్కడి నుంచి వెళ్లిన వెంటనే వేగంగా వస్తున్న రైలు అతడిని ఢీకొట్టింది. సాంకేతిక ఆధారాలు, మొబైల్ లొకేషన్ డేటా ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!