Haryana Shocker: లవర్కు రంగులు రాశాడని, ఫ్రెండ్ దారుణహత్య..
- హర్యానాలో దారుణం..
- లవర్కు రంగులు రాశాడని, స్నేహితుడి దారుణహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana Shocker: తన ప్రేయసికి రంగులు పూశాడనే కారణంగా ఒక వ్యక్తి 23 ఏళ్ల యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హర్యానాలోజరిగింది. హత్యను రైలు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు యువకుడి మృతదేహాన్ని రైల్వే ట్రాక్పై పడేశారని పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలోని పానిపట్లో ఈ ఘటన జరిగింది.
హోలీ పండగ రోజున కాలు అనే వ్యక్తి అదృశ్యమ్యాడు. ఆ తర్వాత అతడి మృతదేహం రైల్వే ట్రాక్పై దొరికింది. మొదట్లో దీనిని రైలు ప్రమాదంగా అంతా భావించారు. అయితే, , ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) జరిపిన దర్యాప్తులో ఇది ముందుగానే పథకం ప్రకారం చేసిన అత్యంత కిరాతకమైన హత్య అని తేలింది. ఈ కేసులో మహమూద్పూర్కు చెందిన సంజు, రాహుల్, విశాల్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
Read Also: Pak-Afghan war: 400 మంది మృతి.. పాకిస్తాన్పై అఫ్ఘాన్ క్రికెటర్ల ఆగ్రహం..
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. హోలీ రంగుల వివాదం, గతంలో ఉన్న వ్యక్తిగత కక్షల కారణంగా హత్య జరిగినట్లు తెలిసింది. విచారణలో ముగ్గురు నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ కుట్ర వెనక ప్రధాన సూత్రధారి సంజు అని పోలీసులు గుర్తించారు. హోలీ రోజున సంజు ప్రేయసికి కాలు రంగులు పూయడంతో గొడవ ప్రారంభమైంది. దీని తర్వాత హత్యకు సంజు ప్లాన్ చేసినట్లు తేలింది. ఘటన రోజున కాలును సంజు బయటకు రావాలని కోరాడు. ముగ్గురు నిందితులతో కలిసి కాలు మద్యం సేవించాడు. కాలుతో ఎక్కువ మందు తాగించారు.
కాలు మద్యం మత్తులో ఉన్నప్పుడు ,అతడిని బైక్పై రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడే సంజు స్క్రూడ్రైవర్తో అతని మెడపై రెండుసార్లు దాడి చేశాడు. అయినప్పటికీ, ఈ దాడి జరిగినప్పటికీ కాలు మరణించలేదు. ఆ తర్వాత కాలు కాళ్లు చేతులు కట్టేసి, రైల్వే ట్రాక్పై పడుకోబెట్టారు. మద్యం మత్తు, గాయాల వల్ల కాలు కదలలేకపోయాడు. నిందితులు అక్కడి నుంచి వెళ్లిన వెంటనే వేగంగా వస్తున్న రైలు అతడిని ఢీకొట్టింది. సాంకేతిక ఆధారాలు, మొబైల్ లొకేషన్ డేటా ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..