Tesla: భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు టెస్లా సిద్ధం.. కానీ ఒక కండీషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla: భారతదేశంలోకి ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం, బిలియన్ ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా ఎంట్రీ ఇవ్వనుంది. వచ్చే ఏడాది భారత్ లోకి టెస్లా కార్లు రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి చర్చలు తుదిదశకు వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు భారత్ లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. గుజరాత్, మహారాష్ట్ర లేదా తమిళనాడు రాష్ట్రాల్లోని ఏదో ఒక ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.
Read Also: Minister Niranjan Reddy: మజీద్ల వద్ద ముస్లిం సోదరులను కలిసిన మంత్రి నిరంజన్ రెడ్డి
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
అయితే దీనికి ఒక కండీషన్ పెట్టిన్నట్లు ఎకనామిక్ టైమ్స్ శుక్రవారం నివేదించింది. ప్రభుత్వం టెస్లా వాహనాలపై దిగుమతి సుంకాన్ని తొలి రెండేళ్లలో 15 శాతం తగ్గిస్తే.. భారతదేశంలో ఫ్యాక్టరీని నెలకొల్పి 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి టెస్లా సిద్ధంగా ఉందని తెలిపింది. దిగుమతి పన్నులను 15 శాతం కన్నా తక్కువకు తగ్గించడానికి కొత్త ఈవీ పాలసీని కేంద్రం రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పన్నులు 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై 100 శాతం, మిగిలిన వాటిపై 70 శాతంగా ఉంది.
ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ 12,000 వాహనాలకు సుంకాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఆమోదిస్తే.. 500 మిలియన్ డాలర్ల వరకు, 30,000 వాహనాలకు రాయితీ ఇస్తే 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎకనామిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని, తక్కువ సుంకంపై దిగుమతి చేసుకునే వాహనాల సంఖ్యను తగ్గించాలని కోరుతుందని సమాచారం. అయితే దీనిపై ఇటు టెస్లా కానీ, అటు ప్రభుత్వ వర్గాలు కానీ స్పందించలేదు.
- Tags
- automobiles
- Business
- Elon Musk
- EVs
- india
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!